Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీకట్లో వజ్రాలు మెరుస్తుంటాయెందుకు..?

Webdunia
FILE
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలో రాతి పొరల మధ్య చిక్కుకున్న బొగ్గు ముక్కలు అపారమైన వేడికి, ఒత్తిడికి గురై క్రమంగా వజ్రాలుగా మారుతాయి. నల్లగా, ముట్టుకుంటే చేతికి మసి అంటుకునే బొగ్గుముక్కలే నేడు వాడుకలో ఉండే వజ్రాలు. అయితే చీకట్లో వజ్రాలు మెరుస్తాయని అందరూ అనుకుంటారు. అది అపోహే కానీ, నిజంకాదు. ఎందుకంటే వజ్రానికి దీపంలాగా స్వయంగా వెలుగునిచ్చే శక్తి లేదు.

స్వల్ప కాంతిలో కూడా వజ్రం తళతళ మెరుస్తుంటుంది. కానీ వజ్రంలో బొగ్గు పరమాణువులు తప్ప, మరేమీ ఉండవు. భూగర్భంలోని ఒత్తిడివల్ల బొగ్గు అణువులు ఒక ప్రత్యేక పద్ధతిలో అమరి, స్పటికలాగా ఏర్పడతాయి. ఇలాంటి వాటిని గనుల్లోంచి త్రవ్వి తీసినప్పుడు మొద్దులాగా ఉంటాయేగానీ మెరవవు. వీటిని ప్రత్యేక పద్ధతిలో సానబెట్టడం వల్లనే మెరుపు సంతరించుకుంటాయి.

అలా సానబెట్టిన వజ్రం మెరుస్తూ ఉంటుంది. అలా ఎందుకు మెరుస్తుందంటే గాజు, నీరు లాంటి పారదర్శకమైన వస్తువులన్నింటికీ కాంతి కిరణాలను పంచే శక్తి ఉంది. ఈ విధంగా పంచే శక్తి అధికంగా ఉండే వస్తువు వజ్రం. కాబట్టి.. వజ్రంమీద పడిన కాంతి కిరణం బయటికి సులభంగా రాలేక మళ్లీ, మళ్లీ వెనుదిరిగి.. తిరిగి వేర్వేరు ముఖాలమీద పరావర్తనం చెందుతుంది. అలాంటప్పుడు అది వెలుగు విరజిమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది.

కొన్ని వజ్రాలలో రంగురంగుల గీతలు, చారికలు, చుక్కలు కనిపిస్తుంటాయి. ఇవి స్పటికంలోని లోపాలవల్ల ఏర్పడతాయి. స్పటికం నిర్మాణంలో మామూలుగా ఉండాల్సిన బొగ్గు పరమాణువుల స్థానాలలో కొన్నిచోట్ల ఇతర ధాతువుల పరమాణువులు వచ్చి చేరటం, స్పటికంలోపల పగుళ్లు ఉండటంలాంటివి పై లోపాలలో కొన్ని రకాలుగా చెప్పవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

లింగ మార్పిడి చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా..... ఆపై ముఖం చాటేసిన ప్రియుడు..

KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. పరామర్శించిన కల్వకుంట్ల కవిత

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments