Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు మకరరాశి జాతకులా..? అయితే నీలం ధరించండి!

Webdunia
ఆదివారం, 9 మార్చి 2014 (17:48 IST)
File
FILE
మీరు మకరరాశి జాతకులా..? అయితే నవరత్నాలలో నీలరత్నాన్ని ధరించడం శ్రేష్టమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. సృజనాత్మకత, ధైర్యవంతులు, పట్టుదల గలవారుగా ఉండే వీరు.. నీలరత్నాన్ని ధరించడం ద్వారా ముఖకాంతి, నేత్రకాంతిని పెంపొందింపజేసుకోవచ్చునని రత్నాల శాస్త్రం అంటోంది.

ఈ రాశికి శనీశ్వరుడు అధిపతి కావున, ఈ రాశిలో జన్మించిన జాతకులు తప్పకుండా నీలమును ధరించాలి. ఇంద్రనీలము, మయూర నీలము, నీలమణి అనే మూడు రకాల్లో రత్నాల శాస్త్ర నిపుణులను సంప్రదించి మకరరాశి జాతకులు ధరించడం ఎంతో మంచిది.

ఆంగ్లంలో సెఫైర్ అనే పిలువబడే ఈ రత్నమును ధరించడం ద్వారా శని గ్రహదోషాలను, ఏలినాటి శని దోషాలను నివారించవచ్చునని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా రాత్రిపూట వచ్చే భయానక కలలను కూడా నివారిస్తుందని వారు చెబుతున్నారు.

ఆయుషు, బలము, బుద్ధి వృద్ధిచెందడం, అకస్మాత్తుగా జరిగే దొంగతనం, దుర్ఘటనలు వంటివి జరగకుండా నివారించేందుకు నీలరత్నాన్ని ధరించడం మంచిదని రత్నాల శాస్త్రం చెబుతోంది.

నీలాన్ని కనుగొనడం ఎలా..?
నీలము పల్చగా, స్వచ్ఛమైన మెరుపు కలిగి ఉంటుంది. ఎక్కువ శుభ్రముగా ఉండని ఈ రత్నము ఛారలు కలిగి ఉంటుంది. అసలైన నీలమును నీరు నింపిన గాజు గ్లాసులో వేస్తే ఆ నీటి నుండి నీల కిరణాలు వెలువడుతాయి. ఇంకా అసలైన నీలాన్ని ఎండలో ఉంచితే నీలపు కిరణాలు వస్తాయి.

ఎలా ధరించాలంటే...?
శనివారం సూర్యోదయానికి ముందే ధరించాలి. ఎడమచేతి మధ్యవేలుకు ధరించాలి. వెండిలోహముతో పొదిగించుకుని ధరించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ధరించే ముందు గంగాజలములోగానీ, పాలులోగానీ శుద్ధి చేయాలి. ధరించే ముందు శని ధ్యాన శ్లోకమును 190 సార్లు ధ్యానించడం మంచిది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

లేటెస్ట్

26-09-2024 గురువారం దినఫలితాలు : బంధువుల వైఖరి నిరుత్సాహ పరుస్తుంది...

ఇందిరా ఏకాదశి - 21 సార్లు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తే.. జాతక దోషాలు..?

మల్బరీ సిల్క్ దుస్తులతో ముస్తాబైన అయోధ్య రామయ్య

యాగానికే కిలో నెయ్యి రూ.1400.. లడ్డూకి రూ.344లకే ఎలా ఇచ్చారు..?

25-09-2024 మంగళవారం దినఫలితాలు : వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి...

Show comments