Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్‌కు జైలుశిక్షి.. కెరీర్ ముగిసినట్టే!!

ఠాగూర్
గురువారం, 11 జనవరి 2024 (09:34 IST)
మైనర్ బాలిక అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ ఒకరికి ఎనిమిదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ స్థాని కోర్టు తీర్పునిచ్చింది. సందీప్ లామిచానే అత్యాచారం కేసులో ముద్దాయిగా తేలడంతో కోర్టు జైలుశిక్షతో పాటు అపరాధం కూడా విధించింది. అయితే, కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ క్రికెటర్ హైకోర్టులో అప్పీలే చేయనున్నట్టు తెలిపారు. 
 
ఇపుడిపుడే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాణిస్తున్న నేపాల్ క్రికెట్ జట్టులో ఎంతో ప్రతిభావంతుడిగా పేరుపొందిన స్టార్ లెగ్ స్పిన్నర్, మాజీ కెప్టెన్ సందీప్ లామిచానే మైనర్ బాలిక అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. దీంతో అతనికి నేపాల్‌లోని ఖాట్మండ్ జిల్లా కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.
 
ఖాట్మండులోని ఓ హోటల్ గదిలో లామిచానే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 17 ఏళ్ల అమ్మాయి ఫిర్యాదు చేసింది. దీంతో లామిచానేపై కేసు నమోదైంది. కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న లామిచానేపై అప్పట్లో ఇంటర్ పోల్ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. దాంతో లామిచానే బయటికి రాక తప్పలేదు.
 
ఇంటర్ పోల్ సాయంతో లామిచానేను ఖాట్మండులోని త్రిభువన్ ఎయిర్ పోర్టులో నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులోనే అతడికి శిక్ష పడింది. అంతేకాదు, జరిమానా కింద కోర్టుకు 3 లక్షల నేపాలీ రూపాయలు చెల్లించాలని, బాధితురాలికి పరిహారం కింద 2 లక్షల నేపాలీ రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం లామిచానే బెయిల్ మీద బయట ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments