Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక మోసం కేసులో రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్ల అరెస్టు

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (13:28 IST)
ఆర్థిక మోసం కేసులో రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు అరెస్టు అయ్యారు. రూ.740 కోట్ల నిధుల దుర్వినియోగం, ఫ్రాడ్ కేసులో పంజాబ్‌లోని లుథియానాలో గురువారం శివీందర్ సింగ్‌ను, శుక్రవారం ఉదయం మల్వీందర్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
తమ సంస్థకు చెందిన రూ.740 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారంటూ రెలిగేర్ ఫిన్ వెస్ట్ ఆరోపణలు చేయడమేకాకుండా, వారిపై గత యేడాది డిసెంబరు నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గత ఆగస్టు నెలలో వీరి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 
 
ఈ క్రమంలో సోదరులపై చీటింగ్, ఫ్రాడ్, నిధుల దుర్వినియోగం తదితర ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో, వీరిపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది.
 
తమ తండ్రి స్థాపించిన మల్టీ బిలియన్ డాలర్ రాన్ బాక్సీ సంస్థకు ఈ సోదరులిద్దరూ వారసులుగా ఉండగా, గత 2008లో ఈ సంస్థను జపాన్‌కు చెందిన డైచీకి వీరు అమ్మేశారు. ఈ విక్రయాల సమయంలో కొంత సమాచారాన్ని దాచిపెట్టినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments