ఆర్థిక మోసం కేసులో రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్ల అరెస్టు

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (13:28 IST)
ఆర్థిక మోసం కేసులో రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు అరెస్టు అయ్యారు. రూ.740 కోట్ల నిధుల దుర్వినియోగం, ఫ్రాడ్ కేసులో పంజాబ్‌లోని లుథియానాలో గురువారం శివీందర్ సింగ్‌ను, శుక్రవారం ఉదయం మల్వీందర్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
తమ సంస్థకు చెందిన రూ.740 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారంటూ రెలిగేర్ ఫిన్ వెస్ట్ ఆరోపణలు చేయడమేకాకుండా, వారిపై గత యేడాది డిసెంబరు నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గత ఆగస్టు నెలలో వీరి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 
 
ఈ క్రమంలో సోదరులపై చీటింగ్, ఫ్రాడ్, నిధుల దుర్వినియోగం తదితర ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో, వీరిపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది.
 
తమ తండ్రి స్థాపించిన మల్టీ బిలియన్ డాలర్ రాన్ బాక్సీ సంస్థకు ఈ సోదరులిద్దరూ వారసులుగా ఉండగా, గత 2008లో ఈ సంస్థను జపాన్‌కు చెందిన డైచీకి వీరు అమ్మేశారు. ఈ విక్రయాల సమయంలో కొంత సమాచారాన్ని దాచిపెట్టినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments