Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత 9 ఏళ్లలో వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల్లో 300 శాతం పెరుగుదల: రైతు సంఘాల నివేదిక

ఐవీఆర్
బుధవారం, 15 మే 2024 (21:28 IST)
ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక మొదలైన రాష్ట్రాల్లోని వాణిజ్య పంటల సాగులో వున్న మిలియన్ల మంది రైతులు మరియు వ్యవసాయ కార్మికుల కోసం ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్స్ (ఫైఫా-FAIFA), ఈరోజు న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద 'రైతు జీవనోపాధికి భరోసా: సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతు ఆదాయాలను పెంచడం' అనే అంశంపై సెమినార్‌ను ఏర్పాటు చేసింది.
 
సెమినార్ సందర్భంగా, ఫైఫా ఒక నివేదిక- 'భారత వ్యవసాయంలో రూపాంతరం'ను విడుదల చేసింది, ఇది గత దశాబ్ద కాలంలో వ్యవసాయ రంగంలో సాధించిన కీలక విజయాలను వెల్లడిస్తూనే రైతు ఆదాయాలను స్థిరమైన పద్ధతిలో పెంచడానికి వ్యూహాలను సైతం ముందుకు తెచ్చింది. ఈ సెమినార్‌లో మాజీ పార్లమెంటు సభ్యుడు(రాజ్యసభ) శ్రీ జివిఎల్ నరసింహారావు, బిజెపి కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు, శ్రీ రాజ్ కుమార్ చాహర్ పాల్గొన్నారు. ఈ సెమినార్‌లో ముఖ్య వక్తలుగా పూణె లోని BAIF రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్, సీనియర్ అడ్వైజర్, నాబార్డ్ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రొఫెసర్ ఎంవి అశోక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ డాక్టర్ జెపి టాండన్ పాల్గొన్నారు.
 
"జై కిసాన్" అనే పదంపై దృష్టి సారించిన నివేదిక, మన రైతులు లేదా మన అన్నదాతలు నిస్సందేహంగా అవకాశాలపై మొదటి హక్కును పొందారని ధృవీకరిస్తుంది. ఫైఫా నివేదిక ప్రభుత్వం యొక్క దశాబ్ద కాలపు ప్రయత్నాలను మెచ్చుకుంది, ఇది ఫలితాలు అందించటంలో అనుసరించిన సమగ్ర విధానాన్ని గుర్తించింది. ప్రభుత్వ విజయాల యొక్క విస్తృతమైన విశ్లేషణను అందించింది. 9 సంవత్సరాల వ్యవధిలో వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులో 300 శాతం అధికంగా కేటాయింపులు చేయటం వంటి కీలక విజయాలను సైతం వెల్లడించింది; PM కిసాన్ నుండి 11 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారని; MSP వద్ద పప్పుధాన్యాల సేకరణలో 7350% పెరుగుదల కనిపించిందని వెల్లడించింది. 
 
నివేదికను విడుదల చేసిన సందర్భంగా అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) అధ్యక్షుడు జవార్ గౌడ మాట్లాడుతూ, "వ్యవసాయ రంగంలో, రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. మన దేశానికి, ప్రపంచానికి కూడా ఆహారం అందిస్తున్న మన అమూల్యమైన 'అన్నదాత'కి సహాయం చేస్తూ, రైతు ఆదాయాన్ని పెంపొందించడంలో, వారి భద్రతకు భరోసా ఇవ్వడంలో అవిశ్రాంతంగా కృషి చేస్తుంది. పీఎం-కిసాన్ సమ్మాన్ యోజన వంటి కీలక విధాన కార్యక్రమాలు ద్వారా సన్నకారు మరియు చిన్న రైతులతో సహా ఏటా లక్షలాది మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇప్పటివరకు మొత్తం రూ. 2.80 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేయబడ్డాయి. అలాగే, PMFBY కింద 4 కోట్ల మంది రైతులకు పంట బీమా కవరేజీని విస్తరించారు" అని అన్నారు. 
 
సమగ్ర పంటల బీమా పాలసీ రైతులకు కీలకమైన రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది, ఊహాతీత ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణను అందజేస్తుంది, తద్వారా వారి జీవనోపాధిని కాపాడుతుంది. ఆర్థిక వినాశనాన్ని నివారిస్తుంది. ఈ నివేదికలో హైలైట్ చేయబడిన మరో ముఖ్యమైన విజయం ఏమిటంటే, కనీస మద్దతు ధర (MSPలు) పరంగా చారిత్రాత్మకంగా పెరుగుదల, ఇక్కడ మొదటిసారిగా మొత్తం 22 పంటలకు MSP ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా నిర్ణయించబడింది. 2018-19 వ్యవసాయ సంవత్సరం నుంచి ప్రభుత్వం దీనిని నిర్ధారిస్తుంది.
 
ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్స్(ఫైఫా) వైస్ ప్రెసిడెంట్, అథర్ మతీన్ మాట్లాడుతూ, “ప్రభుత్వం యొక్క MSP కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రైతులకు గొప్ప ఉపశమనం కలిగించాయి. రైతుల ప్రయోజనాల కోసం ఇటువంటి ప్రశంసనీయమైన కార్యక్రమాలను కొనసాగించాలని, డిజిటల్‌ వేదికలను మరింత ప్రోత్సహించాలని మేము ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇ-నామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు వ్యవసాయం, ఉద్యానవన ఉత్పత్తులకు సౌకర్యవంతమైన రీతిలో ఆన్‌లైన్ ట్రేడింగ్‌ను సులభతరం చేయడం ద్వారా వ్యవసాయాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి, ఇవి మరింత అధిక మార్కెట్ అవకాశాలు, సరసమైన ధరలతో రైతులను శక్తివంతం చేస్తాయి" అని అన్నారు. 
 
ఉత్పాదకతను పెంపొందించడానికి, డిజిటల్ చేరికను చురుకుగా ప్రోత్సహించడానికి ప్రభుత్వ ప్రయత్నాన్ని ఫైఫా నివేదిక ఎత్తి చూపింది. 2016లో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఇ-నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ప్రారంభించడం వల్ల అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీల (APMC) మండీల ఏకీకరణను సులభతరం చేసింది. రైతులు, రైతు-ఉత్పత్తి సంస్థలు (FPOలు), కొనుగోలుదారులు, వ్యాపారులకు పలు ప్రయోజనాలను అందించింది. ఇ-నామ్ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానించబడిన మార్కెట్‌ల సంఖ్య 2016లో 250 నుండి 2023లో 1,389కి పెరిగింది, ఇది 209 వ్యవసాయం, ఉద్యానవన ఉత్పత్తుల ఆన్‌లైన్ ట్రేడింగ్‌ను సులభతరం చేసింది. పారదర్శక ధరల ఆవిష్కరణ వ్యవస్థ, ఆన్‌లైన్ చెల్లింపు సౌకర్యం ద్వారా మార్కెట్ అవకాశాలను ప్రోత్సహిస్తూ 1.8 కోట్ల మంది రైతులు, 2.5 లక్షల మంది వ్యాపారుల నమోదును వేదిక చూసింది. ఇంకా, ప్లాట్‌ఫారమ్‌లో వాణిజ్య విలువ ఆగస్టు 2017లో రూ. 0.3 లక్షల కోట్ల నుండి నవంబర్ 2023 నాటికి రూ. 3 లక్షల కోట్లకు పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments