ధనుర్మాసం ప్రారంభమైననాటి నుంచి పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. పల్లె వాకిళ్ల ముంగిట రకరకాల రంగులతో తీర్చిదిద్దిన రంగవల్లికలలో గొబ్బెమ్మలు దర్శనమిస్తాయి. పంటపొలాలు ధాన్యంతో నిండి ప్రకృతికి శోభనిస్తుంది. ఇక హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులను ఆడిస్తూ సరదా చేసే గంగిరెద్దులవారితో ప్రతి పల్లె సంతోషంలో మునిగితేలుతుంది.
ధనుర్మాసంలో వచ్చే ఏకాదశినాడు విష్ణు మూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. అదే విధంగా ప్రతి శనివారం సంవత్సరం పాటు ఈ క్రింది స్తోత్రాలను జపిస్తే శనిపీడ దరిచేరదు.