కావలసిన పదార్థాలు : మైదాపిండి.. అర కేజీ డాల్డా.. పావు కేజీ పంచదార.. పావు కేజీ బూస్టు.. 50 గ్రా. చిక్కటిపాలు.. ఒకటిన్నర కప్పు యాలకులపొడి.. ఒక టీ. ఉప్పు.. పావు టీ. అమ్మోనియం బై కార్బొనేట్.. అర టీ. సోడా బైకార్బ్.. అర టీ.
తయారీ విధానం : డాల్డా, పంచదారపొడి, బూస్టు కలిపి క్రీములా చేయాలి. వీటికి మైదా, పాలు, యాలకులపొడి, అమ్మోనియం బైకార్బొనేట్, సోడా బైకార్బ్, ఉప్పు చేర్చి ముద్దలా కలిపి కాసేపు గాలి చొరబడకుండా మూతపెట్టి ఉంచాలి. ఈ పిండిని చపాతీలా అరంగుళం మందంగా చేసి పలుచటి స్టీలు చాకుతోగానీ, నలుచదరంగా ఉండే ఏదైనా చిన్న గిన్నెతో గానీ ముక్కలుగా కోసి నెయ్యి రాసిన ప్లాస్టిక్ ట్రేలో ఉంచి మైక్రోవేవ్ ఓవెన్లో 15 నిమిషాలపాటు 275 డిగ్రీల ఫారన్ హీట్ వద్ద బేక్ చేయాలి.
ఒవెన్ లేకపోతే కుక్కర్లో గానీ, మూత ఉన్న మందపాటి పాత్రలోగానీ ఇసుకపోసి పొయ్యిమీద పెట్టి పదినిమిషాలు ఉంచాలి. కుక్కర్లో పెట్టినప్పుడు గ్యాస్కెట్ తీసేయాలి. ఇసుక వేడెక్కాక బిస్కెట్స్ ప్లేటు పెట్టాలి. ప్లేటు మందంగా, లోతుగా ఉండాలి. పది నిమిషాల తరువాత తీసి చూస్తే బూస్టీ టేస్టీ బిస్కెట్స్ రెడీ.