Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి ప్రజలు పోటీ చేయమంటే బరిలో ఉంటా : కేజ్రీవాల్

Webdunia
సోమవారం, 17 మార్చి 2014 (14:33 IST)
File
FILE
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి ఎంపీ సీటు నుంచి స్థానిక ప్రజలు పోటీ చేయమంటే ఖచ్చితంగా బరిలోకి దూకుతానని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇదే అంశంపై ఈనెల 23వ తేదీన వారణాసిలో నిర్వహించే ర్యాలీలో ప్రజలు అభిప్రాయాలను తెలుసుకుంటానని ఆయన సోమవారం ప్రకటించారు.

ఈ స్థానం నుంచి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఆయనపై పోటీ చేయాలని అరవింద్ కేజ్రీవాల్‌కు పలువురు సూచిస్తున్నారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. 'మోడీపై పొటీ చేయాలని పార్టీ నన్ను కోరింది. దీంతో వారణాసిలో పోటీ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ గెలుపా, ఓటమా అన్నది ముఖ్యం కాదు. ఈ నెల 23న వారణాసిలో జరిగే ర్యాలీలో పాల్గొంటా. పోటీ చేయాలా, వద్దా నేరుగా ప్రజలనే అడుగుతా. వారు చేయమంటే చేస్తా, లేకుంటే లేదు' అని ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

Show comments