Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని పాలిస్తున్న మంత్రగత్తె : నరేంద్ర మోడీ ధ్వజం

Webdunia
శుక్రవారం, 11 ఏప్రియల్ 2014 (16:09 IST)
File
FILE
భారతదేశాన్ని గత దశాబ్దకాలంగా ఓ మంత్రగత్తె పాలిస్తోందని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా సోనియాగాంధీని విమర్శించారు. భారతీయ జనతాపార్టీ ఓ మాంత్రికుడిని తెచ్చిందని, ఆయన రాత్రికి రాత్రే అంతా మార్చేస్తానంటున్నాడని తనను ఉద్దేశించి సోనియా చేసిన వ్యాఖ్యలను ఆయన జంషెడ్ పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రస్తావించారు.

కేంద్ర ప్రభుత్వం ఓ మంత్రెగత్తెను తెచ్చిందని, ఆమె గత పదేళ్లుగా ఈ దేశాన్ని పాలిస్తోందని, తత్ఫలితంగా ఉపాధి అవకాశాలు గల్లంతయ్యాయని, రైతుల కష్టాలు పెరిగాయని ఆయన అన్నారు. మంత్రగత్తె వల్ల దేశం పదేళ్లుగా దుస్థితిలో ఉందని, తనను తాను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవితాలను కష్టాల్లో పడేసిందని మోడీ మండిపడ్డారు.

తాను చాలా పేద కుటుంబంలో పుట్టానని, అందువల్ల పేదల కష్టాలు తనకు తెలుసునని మోడీ అన్నారు. నోట్లో గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వాళ్లకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని పరోక్షంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని సైతం ఆయన విమర్శలు గుప్పించారు.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments