Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్ కామెంట్స్ : ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తా.. కొట్టండి!

Webdunia
మంగళవారం, 8 ఏప్రియల్ 2014 (15:41 IST)
IFM
FILE
తన పైన వరుసగా జరుగుతున్న దాడులపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం స్పందించారు. తాను ఎక్కడకు రమ్మంటే అక్కడకు.. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని, మీ ఇష్టం వచ్చినట్లు కొట్టుకోండి అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

తనపై జరుగుతున్న దాడి వెనుక రాజకీయ కుట్ర దాగివుందన్నారు. ముఖ్యంగా.. వరుస దాడుల వెనుక బీజేపీ హస్తముందనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. తన లక్ష్యం సమస్య పరిష్కారం కావడమే అన్నారు. సమస్య పరిష్కారం అయితే తాను సంతోషిస్తానని చెప్పారు.

ఇదిలావుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పైన మరోసారి దాడి జరిగింది. ఈసారి కేజ్రీవాల్‌పైన ఓ ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. న్యూఢిల్లీలోని సుల్తాన్ పురి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్‌పైన ఈ డ్రైవర్ దాడికి తెగబడ్డాడు.

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కేజ్రీవాల్ రోడ్డు షో నిర్వహించారు. కేజ్రీవాల్ పార్టీ అభ్యర్థి రాఖీ బిర్లా తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఉన్నట్టుండి కేజ్రీవాల్ వాహనంపైపు దూసుకొచ్చి చెంప చెళ్లుమనిపించారు. దీంతో అవాక్కైన ఆప్ నేతలు... ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

కాగా, కేజ్రీవాల్ భద్రతా సిబ్బందిని నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఢిల్లీ పోలీసులు అతనికి భద్రతను ఇస్తున్నారు. కేజ్రీవాల్ నిత్యం భద్రతాధికారుల సూచనలను పట్టించుకోవడం లేదట. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలోని దక్షిణపురిలో రోడ్డుషో సందర్భంగా కేజ్రీవాల్ పైన ఓ వ్యక్తి పిడిగుద్దు కురిపించిన విషయం తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments