తెలంగాణలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఈ జాబితాలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్ టిక్కెట్ని కేటాయించినట్లు తెలిపారు. ఐతే ఈ స్థానం తెరాస ఓడిపోయే స్థానమనీ, అక్కడ పోటీకి దిగితే కెసిఆర్ కు సైతం డిపాజిట్లు దక్కవన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కనుకనే పనిగట్టుకుని ఆమెకు అలాంటి ఓడిపోయే స్థానాన్ని కట్టబెట్టారంటూ విమర్శలు వస్తున్నాయి. శంకరమ్మ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం వల్లనే ఈ సీటు ఇచ్చారనీ, లేదంటే అసలు ఆయనకు శంకరమ్మకు సీటు ఇవ్వాలన్న ఉద్దేశ్యం లేదనే విమర్శలు కూడా వినవస్తున్నాయి.
ఏదయితేనేం... శంకరమ్మ కోరుకున్నట్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కెసిఆర్ ఇలా కల్పించడం ద్వారా ఆమె నుంచి ఎదురవుతున్న సమస్యను అలా వదిలించుకున్నాడన్న విమర్శలు వస్తున్నాయి.