తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జై తెలంగాణ అనడమే కాదు... తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటే బిసి కులాలకు చెందిన వ్యక్తిని తెలంగాణకు ముఖ్యంత్రిని చెస్తానని చెప్పేశారు. నిన్నరాత్రి వరంగల్ జిల్లా హనుమకొండలో ప్రజాగర్జన సభలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
2008 లోనే తెలంగాణ విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చినట్లు తెలిపారు. కెసిఆర్ వట్టి మోసకారి అనీ, ఇప్పుడు చెప్పిన మాట సాయంత్రానికి మార్చేస్తాడంటూ విమర్శించారు. అతడు మాటల మాంత్రికుడనీ, ఆ కాసేపు మాటలు చెప్పి పబ్బం గడుపుకునే రకం అంటూ మండిపడ్డారు.