భాజపా ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీపై తాజాగా భాజపా అగ్ర నాయకుడు ఎల్కె అద్వానీ పొగడ్తల జల్లు కురిపించారు. అదే సమయంలో నరేంద్ర మోడీ కూడా అద్వానిని కూడా తనదైన శైలిలో ప్రశంసలతో ముంచెత్తారు. శనివారం అద్వానీ గాంధీనగర్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంలో అద్వానీ మీడియాతో మాట్లాడారు.
నరేంద్ర మోడీ కాబోయే ప్రధానమంత్రి అనీ, దేశానికి సమర్థవంతమైన పాలనను అందిచగల సమర్థుడని కితాబిచ్చారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ మాట్లాడుతూ... 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ సింగిల్ డిజిట్ దాటదని జోస్యం చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదని అన్నారు. భాజపాలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.