నరేంద్ర మోడీ వాల్ పోస్టర్లు మోడీ పోటీ చేస్తున్న వడోదర పార్లమెంట్ నియోజకవర్గంలో ఇబ్బడిముబ్బడిగా కనబడుతుండేసరికి మిస్త్రీకి కోపం వచ్చింది. ఇంతకీ ఈ మిస్త్రీ ఎవరనుకుంటున్నారు... గుజరాత్లోని వడోదర నియోజవర్గంలో నరేంద్రమోడీపై కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వ్యక్తి. ఆయన పూర్తి పేరు మధుసూదన్ మిస్త్రీ.
మిస్త్రీ ఇవాళ వడోదర నియోజకవర్గం ప్రచారంలో భాగంగా వెళుతుంటే ఎక్కడ చూసినా నరేంద్రమోడీ పోస్టర్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, కటౌట్లు దర్శనమిచ్చాయి. దీంతో ఉండబట్టలేక మోడీ కటౌట్లను, పోస్టర్లను రోడ్డుపై ఉన్న స్తంభాలు ఎక్కి మరీ పరపరా చింపి పారేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు రంగప్రవేశం చేసి మిస్త్రీని అరెస్ట్ చేశారు.