Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ - చంద్రబాబులకు మతిమరుపు వచ్చిందా?

Webdunia
బుధవారం, 30 ఏప్రియల్ 2014 (17:23 IST)
File
FILE
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులకు ఏమైనా మతిమరుపు వచ్చిందా అనే సందేహం కలుగుతోంది. ప్రజా ప్రతినిథ్య చట్టంలోని ఎన్నికల నియమావళి మేరకు పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓటింగ్ యంత్రంలో తమ ఓటును ఎవరికి వేశామో బహిర్గతం చేయరాదు.

కానీ, నరేంద్ర మోడీ, చంద్రబాబులిద్దరూ ఈ విషయాన్ని మరచిపోయారు. ఫలితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. బుధవారం జరిగిన ఏడో దశ పోలింగ్‌లో అహ్మదాబాద్‌లోని గాంధీ నగర్ పరిధిలో నరేంద్ర మోడీ ఓటు హక్కను వినియోగించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కమలం గుర్తును చూపించి ఈసీకి చిక్కారు. దీంతో ఆయనపై చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన చంద్రబాబు నాయుడు... ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ - బీజేపీ పొత్తు ధర్మం మేరకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటును బీజేపీ అభ్యర్థికి వేసినట్టు చెప్పారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఆగ్రహం వ్యక్తం చేసి.. ఆయన ఓటు చెల్లదని ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

Show comments