Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను తిట్టే దమ్మూ ధైర్యం జగన్‌కు లేదు : పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 1 మే 2014 (14:33 IST)
File
FILE
సీమాంధ్ర ప్రజలను నిరంతరం దూషించే టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావును తిట్టే దమ్మూ ధైర్యం వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికు లేవని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అసలు ఆయనలో సీమ పౌరుషం ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ - బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం మదనపల్లిలో జరిగిన బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు.

కేసీఆర్ తిడుతున్నా జగన్ ఒక్క మాట మాట్లాడరని ఆరోపించారు. కేసీఆర్‌ను అనే ధైర్యం జగన్‌కు లేదన్నారు. అసలు వారిద్దరికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అటు వైఎస్ దోపిడీ విధానం వల్లే తెలంగాణ సమస్య తెరపైకి వచ్చింది, హైదరాబాదు, రంగారెడ్డి, చిత్తూరు జిల్లాలో సెజ్‌ల పేరిట దోచుకున్నారని విమర్శించారు.

సీమాంధ్ర పౌరుషం, దమ్ము, ధైర్యం జగన్‌కు లేదా అన్న పవన్ సీమాంధ్ర గౌరవాన్ని కాపాడలేని జగన్‌కు సీఎం పదవి ఎందుకని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వస్తే దోపిడీ, దొంగల రాజ్యం తప్పదన్నారు. సాక్షి తనపై అనుచిత విమర్శలు చేస్తోందని అయినా భయపడబోనన్నారు. ఇక రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన విడదీసిన తల్లీకొడుకులు సోనియా, రాహుల్లేనని, వారిపైనే తన విమర్శలని పవన్ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

Show comments