2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను తెరాస అధినేత కేసీఆర్ విడుదల చేశారు. సెంటిమెంటుకు ప్రాధాన్యతనిస్తూ 69 అభ్యర్థులను... అంటే 3x2, 3x3 అన్నట్లుగా జాబితాలో 69 పేర్లను పొందుపరిచి ప్రకటించారు. ఐతే పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతికి మొండిచేయి చూపించారు. కొండా సురేఖకు వరంగల్ తూర్పు స్థానాన్ని కేటాయించారు.
ఇకపోతే రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని చెప్పారు. మీడియాలో తెరాస పొత్తు పెట్టుకోబోతోందని వార్తలు వస్తున్నాయనీ, కానీ తాము ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇంకా మేనిఫెస్టోను విడుదల చేసిన కేసీఆర్ అందులోని ప్రధానాంశాలను ప్రకటించారు. లక్ష మంది యువతీయువకులకు ఉద్యోగాలు కల్పిస్తామనీ, అమరవీరుల త్యాగానికి గుర్తుగా వారి స్థూపాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. ఇంకా మరికొన్ని హైలెట్స్ వివరించారు.