Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ సీట్ల కోసం సీమాంధ్రలో ఎగబడుతున్నారు... చిరంజీవి వ్యాఖ్య

Webdunia
శనివారం, 12 ఏప్రియల్ 2014 (14:30 IST)
WD
కేంద్రమంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి శనివారం మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో అధ్వాన్న పరిస్థితిలో ఉన్నదని అంటున్నారనీ, కాని అది వాస్తవం కాదన్నారు చిరంజీవి. అసెంబ్లీ, ఎంపీ, జట్పీటీసి, ఎంపీటిసి కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం సీమాంధ్రలో ఎగబడుతున్నారనీ, తమకు పుంఖానుపుంఖాలుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చిపడ్డాయని అన్నారు.

ఈ దరఖాస్తులను పరిశీలించి ఎవరికి సీట్లు ఇవ్వాలన్నదానిపై తాము తలమునకలై ఉన్నట్లు తెలిపారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ గడ్డుపరిస్థితిలో ఏమీ లేదనీ, చాలా బలంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి మాజీముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.

కేవలం పార్టీని ఉపయోగించుకుని పదవులను అనుభవించి ఆ తర్వాత అవసరం తీరగానే పలాయనం చిత్తగించారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గురించి తనకు అంతగా అవగాహన లేదని వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments