నాయకులకేం... ఏ ఆటయినా ఆడవచ్చు. ఎంతమందినైనా కట్టుకోవచ్చు. ఇలాంటి ఉదంతాలు చాలానే విన్నాం. తాజాగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ జిలానీగా ఎగిరి పీఎంకె పార్టీలో దూకి చిదంబరం స్థానం నుంచి పోటీ చేస్తున్న కేఐ మణి తన అఫిడవిట్లో తన ఆస్తులతోపాటు తన ఇద్దరి భార్యల ఆస్తులు కూడా ప్రకటించడం చర్చనీయాంశమైంది.
ఆయన రిటర్నింగ్ అధికారికి ప్రకటించిన ఆస్తుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. తన పేరుపై చరాస్తులు రూ. 1,13,92,929, స్థిరాస్తులు రూ. 68, 50,000 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక తన మొదటి భార్య ఉషా పేరు మీద చరాస్తులు రూ. 4,74, 26,000 ఉన్నట్లు తెలిపారు. తన రెండో భార్య గీత పేరు మీద చరాస్తులు రూ. 11,33,800 ఉండగా, స్థిరాస్తులు 61,27,200 ఉన్నట్లు వెల్లడించారు. మొత్తానికి ఎన్నికలు 2014 సందర్భంగా నేరగాళ్లయిన నాయకులు ఒకవైపు వెలుగుచూస్తుంటే, బహుభార్యలున్న నాయకులు కూడా మెల్లిమెల్లిగా బయటకొస్తున్నారు.