దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేస్తే ఫలితం ఏమిటి?

Webdunia
సోమవారం, 9 నవంబరు 2015 (20:09 IST)
లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. శుభ్రంగా కళకళలాడే ఇంట లక్ష్మీదేవి నివాసముంటుంది. అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రమయ్యే సరికి ప్రమిదల దీపాలు, లేదంటే, రంగురంగుల బల్బులు కల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణలు చేస్తారు. 
 
ఇక దీపావళి పూజలో ప్రధానంగా వినాయకుడిని, మాత లక్ష్మీ దేవిని పూజించాలని పురోహితులు అంటున్నారు. ఏ పూజ చేసినా విఘ్నఅధిపతి అయిన వినాయకుడిని ముందుగా పూజించాలి. దీని తర్వాత లక్ష్మీ దేవిని ఆమె మూడు రూపాలయిన లక్ష్మీ, సరస్వతి, మహా కాళి, రూపాలలో పూజిస్తారు. వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. దీపావళి నాడు లక్ష్మీ గణపతులను పూజిస్తారు.
 
లక్ష్మీదేవి రూపం గణపతితో పాటు వుంటుంది. అందుచేత తాము నిర్వహించే కార్యాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని సిరులిచ్చే తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలావుండాలని కోరుకుంటూ దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేస్తారు. మీరు కూడా లక్ష్మీగణపతులను పూజ చేసి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్​కు ఊరట

వివాహేతర సంబంధం.. భర్తను అలా హత్య చేయించిన భార్య.. చివరికి?

వరంగల్, విజయవాడ జాతీయ రహదారులు అనుసంధానించే ప్రాజెక్టు

ఉత్తరాది వ్యాపారుల కారణంగా రాయలసీమ అరటిపండ్లకు భారీ డిమాండ్

పొగమంచు: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఒకదానికొకటి ఢీ.. నలుగురు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

13-12-2025 శనివారం ఫలితాలు - సర్వత్రా అనుకూలం.. కష్టం ఫలిస్తుంది...

డిసెంబర్ 13, 2025, శనివారం, కృష్ణపక్ష నవమి: పది రూపాయలు ఖర్చు చేసి.. ఈ దీపాన్ని వెలిగిస్తే..?

Lakshana shastra: మహిళల బొడ్డుతో పాటు ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ వుంటే?

12-12-2025 శుక్రవారం ఫలితాలు - ధనలాభం.. వాహనసౌఖ్యం పొందుతారు...

Double Decker Bus: సింహాచలానికి డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్

Show comments