Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున దీపాలు వెలిగిస్తే.. ఆ దోషాలు తొలగిపోతాయట...

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (17:02 IST)
దీపావళికి ముందు రోజును నరకచతుర్దశిగా పిలుస్తారు. అంతకుముందు రోజును కొందరు ధనత్రయోదశిగా ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాత రోజును బలిపాడ్యమిగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమే.. ఈ బలి పాడ్యమి. బలిచక్రవర్తిని మించిన దానశూరులుండరు. 
 
వజ్ర, వైఢూర్యాలు, మణిమాణిక్యాలు తదితర వస్తువులను దానమివ్వడం కాక, తన్ను తానే శత్రువుకు దానం ఇచ్చుకున్న వితరణ శీలి బలిచక్రవర్తి. బలిని, ఆయన భార్య విద్యావతిని పూజించే సంప్రదాయం కూడ వుంది. 
 
కేరళలో బలిచక్రవర్తి తమను పరిపాలించాడని నమ్మి, వారు తమ జాతీయ పర్వమైన ఓనంను బలి ప్రీత్యర్ధం జరుపుకుంటారు. ఉత్తరంలో దీపావళి ఐదు రోజుల పండుగ. దక్షిణంలో దీపావళి మూడునాళ్ల పండుగ. దీపావళి రోజున దీపాలు వెలిగించడం ద్వారా అపమృత్యువు దోషాలు తొలగిపోతాయి. అలాగే అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోషసమయాన దీపదానాన్ని చేస్తే, మానవుడు యమమార్గాధికారంనుండి విముక్తుడవుతారని విశ్వాసం. 
 
దీపోత్సవ చతుర్దశి రోజున యమతర్పణం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. హేమాద్రి అనే పండితుడు ఈ దీపోత్సవాన్ని "కౌముదీమహోత్సవం" అని నిర్వచించినట్లుగాను, నరకచతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి, దీపదానం చేయాలని చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు హత్

శ్రావ్య... నీవు లేని జీవితం నాకొద్దు... భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఆ గ్రామ మహిళలు యేడాదికో కొత్త భాగస్వామితో సహజీవనం చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?

ప్రధాని పుట్టపర్తి పర్యటన.. ప్రశాంతి నిలయానికి 100 గుజరాత్ గిర్ ఆవులు

తిరుమల నెయ్యి కల్తీ కేసు.. వైవి సుబ్బారెడ్డి సెక్రటరీ చిన్న అప్పన్న వద్ద సిట్ విచారణ

అన్నీ చూడండి

లేటెస్ట్

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

తర్వాతి కథనం
Show comments