Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లాండ్ కొత్త రాజుకు పట్టాభిషేకం- హ్యారీ వస్తారు.. కానీ మేఘన రాదు..

Webdunia
శనివారం, 6 మే 2023 (12:21 IST)
Meghan Markle
ఇంగ్లాండ్ కొత్త రాజుకు పట్టాభిషేకం జరుగనుంది. మే 6వ తేదీన పట్టాభిషేక మహోత్సవం జరగనుంది ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఇప్పటికే ప్రకటించింది. ఎలిజబెత్ II ఇంగ్లాండ్ రాణి.. గత ఏడాది సెప్టెంబర్ 8న ఆయన కన్నుమూశారు. అతని మరణం తరువాత, చార్లెస్ III ఇంగ్లాండ్ కొత్త రాజుగా సింహాసనాన్ని అధిష్టించారు. 
 
ఈ వేడుకలో, రాచ కుటుంబ సంప్రదాయం ప్రకారం, చేతిలో రాజదండం, దండతో చార్లెస్ సింహాసనంపై కూర్చుంటాడు. ఈ వేడుకలో, 2000వేల మంది ప్రముఖులను ఆహ్వానించారు. ఈ పట్టాభిషేకానికి 700 ఏళ్లుగా ఇంగ్లండ్ రాజులు ఉపయోగించిన బంగారు పూతతో కూడిన సింహాసనం సిద్ధమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో 8వ తేదీన బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక ఈ కార్యక్రమానికి రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ.. తన తండ్రి ఛార్లెస్ 3 పట్టాభిషేకానికి ఓ సాధారణ అతిథిగా రానున్నట్లు సమాచారం. ఇక హ్యారీ సతీమణి మేఘన్ రాకపై బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటన కూడా చేసేసింది. 
 
ఈ కార్యక్రమానికి హ్యారీ వస్తున్నారని, మార్కెల్ మాత్రం హాజరు కావట్లేదని ప్యాలెస్ స్పష్టం చేసింది. ప్రిన్స్ హ్యారీ ఈ పట్టాభిషేకానికి హాజరవుతారని, మేఘన్ మార్కెట్ మాత్రం కాలిఫోర్నియాలోనే వుండిపోతారని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments