Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూ.ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం కోసం తహతహలాడుతున్నారా?

ఏపీ రాజకీయాలు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. దేశంలో తిరుగులేని శక్తిగా వున్న కాంగ్రెస్ పార్టీని అప్పట్లో కూకటివేళ్లతో పెకళించి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వైఎస్సార్ తన పాదయాత్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (15:15 IST)
ఏపీ రాజకీయాలు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. దేశంలో తిరుగులేని శక్తిగా వున్న కాంగ్రెస్ పార్టీని అప్పట్లో కూకటివేళ్లతో పెకళించి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వైఎస్సార్ తన పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చారు. అనంతరం ఆయన మరణించడం, రాష్ట్ర విభజన తదితరాలన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత వైఎస్సార్ వారసుడుగా జగన్ మోహన్ రెడ్డి బరిలో నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా వున్నారు. 
 
ఇక అధికార తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే... నందమూరి హరికృష్ణ కుమారుడు ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తెదేపా కోసం పర్యటనలు చేసి ఊరూరా తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ చిరంజీవి ప్రజారాజ్యం గెలుపు అవకాశాలకు గండికొట్టింది. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయానికి నందమూరి - నారా కుటుంబాల మధ్య గ్యాప్ పెరగడంతో జూ.ఎన్టీఆర్ తెదేపా ప్రచారానికి దూరంగా జరిగారు. పవన్ కళ్యాణ్ సపోర్టుతో తెదేపా అధికారంలోకి వచ్చింది. ఇక 2019లో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది. అధికార తెదేపాకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి. 
 
2014 ఎన్నికల సమయంలో మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ ఈ దఫా తెదేపాకు మద్దతుగా నిలుస్తారో లేదోనన్న అనుమానం వుంది. మరోవైపు నందమూరి హీరో జూ.ఎన్టీఆర్ ఇప్పటికే తెదేపాతో అంటీముట్టనట్లు వున్నారు. పైగా జై లవకుశ చిత్రంలో జై క్యారెక్టర్లో నటించిన ఎన్టీఆర్ డైలాగులు ప్రస్తుత రాజకీయాలపై సెటైర్లు విసురుతూ వుంటాడు. అధికారం కోసం తహతహలాడే పాత్రలో కనిపించాడు. చిత్రంలో జై క్యారెక్టర్ చూస్తే జూ.ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తారా అనే అనుమానాలు కలగవచ్చు. మొత్తమ్మీద చూస్తే వచ్చే ఎన్నికల నాటికి జూనియర్ ఎన్టీఆర్ పోటీకి సిద్ధమవుతారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం