Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోహన్ రెడ్డిని రాహుల్ గాంధీ ఆహ్వానిస్తారా...? తప్పు తెలుసుకున్నారా...?

Webdunia
శుక్రవారం, 8 మే 2015 (15:02 IST)
విభజన చేస్తే చాలు తెలంగాణ మనదే అనుకున్న కాంగ్రెస్ పార్టీకి టి ప్రజలు షాకిచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి వేరే చెప్పక్కర్లేదనుకోండి. పూర్తిగా భూస్థాపితం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగింది. అసలు ఇంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేసిందని అప్పుడే వాదనలు వినిపించాయి. అదేమంటే... ఏపీకి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించి ఉంటే విభజన సమస్యతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇరు ప్రాంతాల్లో పటిష్టమైన స్థితిలో ఉండేదని యువ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. త్వరలో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో, ఏపీలో పార్టీ పరిస్థితిపై ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. 
 
వైఎస్ మరణం తర్వాత రోశయ్యను ముఖ్యమంత్రి చేసినప్పటికీ ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టకుండా ఉండాల్సిందని రాహుల్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలను బట్టి ఆ స్థానంలో జగన్ మోహన్ రెడ్డిని కూర్చోబెడితే పార్టీ పరిస్థితి ఇంత అధ్వాన్నంగా తయారయ్యేది కాదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు పార్టీని కాదని బయటకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి తన పార్టీని ఎన్నికల్లో తెలంగాణలో తీసుకురాలేకపోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రతిపక్ష స్థానానికి పరిమితమయ్యారు. ఈ నేపధ్యంలో రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి చెలిమిని కోరే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments