ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైకాపా ఫ్లెక్సీలు.. ఎన్టీఆర్, సీఎం జగన్.. ఇంకా..?

Webdunia
శనివారం, 27 మే 2023 (14:23 IST)
NTR
బెజవాడలో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైకాపా ఫ్లెక్సీలు కలకలం రేపాయి. పటమట సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైకాపా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది. ఎన్టీఆర్, సీఎం జగన్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 
 
ఎన్టీఆర్‌కి శత జయంతి నీరాజనాలు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. అయితే అవినాష్ ఫ్లెక్సీల ఏర్పాటుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ ఘటనపై స్పందించిన తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్.. టీడీపీపై సెటైర్లు వేశారు. 
 
ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవం.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని దేవినేని అవినాష్ అన్నారు. అంతేగాకుండా ఎన్టీఆర్ లలితకళా అవార్డును పోసానికి ఇస్తున్నామని.. టీడీపీ అధికారంలో వున్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన కూడా లేకుండా చేసేవారని ఫైర్ అయ్యారు. 
 
ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన నేత జగన్ అని గుర్తు చేశారు. తాము కూడా ఎన్టీఆర్ అభిమానులమేనని, ఎన్టీఆర్‌కు బ్యానర్లు కట్టే హక్కు మాకుందన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి రాసివ్వలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుక్కకు తులాభారం, ప్లీజ్ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి: నటి టీనా శ్రావ్య (video)

జై హో పాటపై ఆర్జీవీ కామెంట్లు.. ఏఆర్ రెహ్మాన్‌ వ్యాఖ్యలపై వర్మ ఎండ్ కార్డ్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments