National Youth Day: స్వామి వివేకానంద యువతకు మార్గనిర్దేశం

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (09:53 IST)
National Youth Dayను జనవరి 12న స్వామి వివేకానంద జయంతి రోజున జరుపుకుంటున్నారు. గొప్ప తత్వవేత్తలలో ఒకరైన స్వామి వివేకానంద జీవితం, బోధనలను గౌరవించటానికి భారతదేశం ఈ రోజు జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజు వివేకానంద స్పూర్తిదాయకమైన ఆలోచనలను, యువత వాటి నుండి ఎలా ప్రయోజనం పొందుతారని జరుపుకుంటారు.

 
19వ శతాబ్దపు ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడు, వివేకానంద వేదాంత- యోగా యొక్క భారతీయ తత్వాలను ప్రపంచానికి పరిచయం చేశారు. జనవరి 12, 1863న స్వామి వివేకానంద ఉత్తర కలకత్తాలో నరేంద్రనాథ్ దత్తగా జన్మించారు. భారతదేశంలో హిందూమతం యొక్క పునరుజ్జీవనం వెనుక ఒక ప్రధాన శక్తిగా పరిగణించబడ్డారు.

 
1881లో మొదట రామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించారు వివేకానంద. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ను స్థాపించిన వివేకానంద వలస భారతదేశంలోని ప్రజలలో జాతీయతా భావాన్ని నింపిన ఘనత కూడా ఉంది. ఈ రెండూ వేదాంతానికి సంబంధించిన తత్వశాస్త్రం, సూత్రాల బోధనకు ముఖ్యమైన కేంద్రాలుగా మారాయి.

 
వివేకానందుడు హిందూ తత్వశాస్త్రం-వేదాంత బోధలపై ఆయన చేసిన గ్రంథాలు - జ్ఞాన-యోగ, భక్తి-యోగ, కర్మ-యోగ మరియు రాజ-యోగ అనే నాలుగు అంశాలపై రచనలు చేసారు. వివేకానంద చికాగోలో పాశ్చాత్య ప్రపంచానికి హిందూమతాన్ని పరిచయం చేస్తూ 1893లో తన ప్రసిద్ధ ప్రసంగానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మతోన్మాద ప్రమాదాల గురించి కూడా ఆయన హెచ్చరించాడు. సమాజాన్ని ఉద్దరించడానికి అనుసరించాల్సిన మార్గాలను ఆయన ఎన్నో చెప్పారు.
Koo App

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments