Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న ఎంతో కాలం సాగ‌దు: ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (15:22 IST)
MP రాక్షసత్వపు రాజకీయాలని తెలుగునాట పెంచి పోషిస్తున్న వైసీపీ పాలనలో మరో మైలురాయి నమోదయ్యింద‌ని టీడీపీ ఎంపీ కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడు అభివ‌ర్ణించారు. ఏపీలో నానాటికి పెరుగుతున్న అరాచకత్వం పతాక స్థాయికి చేరింద‌ని, దేవినేని ఉమాపై జరిగిన దాడి దురదృష్టమే కానీ అందులో ఆశ్చర్యం లేద‌న్నారు.

విధ్వంసాలు తప్ప, పరిపాలన చేతకాని ఈ ప్రభుత్వం నుండి ఇంత కన్నా ప్రజలు ఏం ఆశించగలరు? అని ప్ర‌శ్నించారు. వైసీపీ గూండాలు చేస్తున్న దుర్మార్గాలు, పిరికిపంద చర్యలకు మేం భయపడం!

మా కార్యకర్తలకు జరుగుతున్న ప్రతి అన్యాయానికి జవాబు చెప్పే రోజు దగ్గరలోనే ఉంద‌న్నారు. దుర్మార్గం, అరాచకత్వం, రాక్షసత్వం, విధ్వంసం... ఈ నాలుగు స్తంభాలే ఆధారంగా వైసీపీ కడుతున్న సామ్రాజ్యం ఎంతో కాలం సాగబోద‌ని కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments