Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఎన్నికల కోసం తమ్ముడు పార్టీలోకి అన్నయ్య.. జనసేనలో కీలక పదవి..?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. ఆపై కాంగ్రెస్‌లో పార్టీ విలీనం చేసి.. అంతగా కలిసిరాకపోవడంతో సినిమాల వ

Webdunia
శనివారం, 14 జులై 2018 (18:44 IST)
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. ఆపై కాంగ్రెస్‌లో పార్టీ విలీనం చేసి.. అంతగా కలిసిరాకపోవడంతో సినిమాల వైపు దృష్టి పెట్టిన చిరంజీవి.. ప్రస్తుతం మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారని టాక్ వస్తోంది. అంతేగాకుండా తమ్ముడు జనసేన పార్టీలో అన్నయ్యకు మంచి హోదాతో కూడిన పదవి రానుందని సమాచారం. 
 
మొన్నటివరకు వేర్వేరుగా వుండిన అన్నయ్య, తమ్ముడు అభిమానులు ప్రస్తుతం కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ అభిమాన సంఘాలు రెండూ కలసి పోవడం ఎన్నికలకు కలసి పని చేస్తామని చెప్పడం చూస్తుంటే ఏపీ రాజకీయ తెరపై సందడి పెరిగిపోతోంది. 2019 ఎన్నికలకు జనసేన వేగంగా రెడీ అవుతోందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. 
 
అధికార, ప్రతిపక్ష పార్టీలతో పోటీపడేందుకు జనసేన పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తుందని.. అందుకే పవన్ ఏపీలో యాత్ర మొదలెట్టారని.. తెలంగాణలోనూ పట్టుకోల్పోకుండా వుండేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 
 
జనసేనకు మొన్నటివరకు ఎలాంటి మద్దతు లభించలేదు. కానీ తాజాగా మెగా ఫ్యామిలీ మొత్తం జనసేనాని పవన్ వెనక వున్నామని ప్రకటించడంతో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి మంచి ఫలితాలుంటాయని టాక్. ఇందులో భాగంగానే మెగా ఫ్యాన్సును అన్నయ్య తమ్ముడి జనసేనలోకి పంపారు.  రానున్న కాలంలో చిరంజీవి కూడా తమ్ముడి పార్టీలో కీలక పదవిని అలంకరిస్తారని ఊహాగానాలొస్తున్నాయి. 
 
చిరంజీవి సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లే అంతా భావించారు. కానీ చిరంజీవిని పవన్ తిరిగి తన పార్టీలోకి ఆహ్వనిస్తారని జనసేనలో గౌరవ అధ్యక్ష పదవి కూడా పవన్ కట్టబెట్టబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అదే కనుక జరిగితే.. జనసేనకు మరింత బలంతో ఎన్నికల్లోకి దూసుకెళ్తుందని రాజకీయ పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments