Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీతో పొత్తు.. సీట్ల కష్టాలొద్దు మహా ప్రభూ...

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (18:29 IST)
టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పరిస్థితి దయనీయంగా మారింది. సీట్ల విషయంలో తప్ప మిగిలిన విషయాలపై పవన్‌తో చంద్రబాబు చర్చిస్తున్నారు. ఇది జనసేనకు ఇష్టం లేదు. చంద్రబాబులో నిజమెంతో తేలిపోతుందని, చివరి వరకు ఉత్కంఠ కొనసాగుతుందని జనసేన నేతలు భయపడుతున్నారు. ఇదే సందర్భంలో జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
రాజకీయం అంటే ఇదేనా? అని పవన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో తాను, చంద్రబాబు కలిసి నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పారు. సీఎం కథ ఎవరిది, ముందుగా ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తారనే విషయాలపై క్లారిటీ ఇస్తేనే రెండు పార్టీలకు లాభం చేకూరుతుందని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. అలా జరగకపోతే.. మొదటికే మోసం వస్తుందని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు.
 
జనసేనకు వచ్చే సీట్లపై మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎన్నికలకు ముందు జనసేనకు కనీసం 30 సీట్లు వస్తాయని ప్రచారం జరిగింది. మరోవైపు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దూకుడు మీదున్నారు. అక్కడక్కడ మార్పులు చేర్పులు చేశారు. 
 
అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ప్రజల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీతో పొత్తుకు తమ పార్టీ శ్రేణులు అంగీకరించడం లేదని, అయితే సీట్ల విషయంలో క్లారిటీ ఇస్తేనే ఒకరికొకరు ఓట్లు మార్చుకునే అవకాశం ఉంటుందని, లేదంటే భారీగా నష్టపోవాల్సి వస్తుందని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments