ప్రతి కార్యకర్తకి FB, YouTube, Twitter అన్న జగనన్న: అందుకే అవంతికి ఆగ్రహం, వైసిపి కుండకు చిల్లు

ఐవీఆర్
గురువారం, 12 డిశెంబరు 2024 (15:36 IST)
ఉత్తరాంధ్ర వైసిపి కుండకు చిన్నగా చిల్లు పడుతోంది. కీలక నాయకులు క్రమంగా హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఈ వరుసలో ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేరిపోయారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా జగన్ మోహన్ రెడ్డి తొందరపడుతున్నారని, ఐదేళ్లపాటు వారి పాలనను చూసాక మనం కాదు ప్రజలే తీర్పు ఇస్తారని అవంతి అంటున్నారు. పైగా కార్యకర్తలను ఒత్తిడి చేసి ముందుకు తోస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్క కార్యకర్తకి FB, YouTube, Twitter ఖాతాలు వుండాలనీ, దాని ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటూ జగన్ పిలుపునిచ్చారు.
 
ఐతే జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలు నలిగిపోతున్నారని అవంతి అంటున్నారు. సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టండి... ప్రభుత్వం కేసులు పెడితే మన లాయర్లు చూసుకుంటారు అని అనడం ఎంతవరకు సబబు. కార్యకర్తలపై కేసులు పెడితే అది ఊరకనే పోతుందా... స్టేషన్లు చుట్టూ వాళ్లవాళ్ల కుటుంబాలను వదిలేసి తిరగాలా.. ఇదెక్కడి న్యాయం. రాష్ట్రం ఆర్థికంగా చాలా చితికిపోయి వున్నదని మనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వరా?
 
 
ఇదిలావుంటే.. జగన్ నిర్ణయంతో ఇంకా చాలామంది నాయకులు జంప్ అయ్యే అవకాశం వుందని ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు అంటున్నారు. ఇదే జరిగితే... జగన్ చేపట్టే ఆందోళన కార్యక్రమం ప్రారంభం కాకముందే వైసిపి కుండకి పడిన చిల్లు మరికాస్త పెద్దదయ్యే అవకాశం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments