Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీకి ఫండ్స్ ఇవ్వలేదనేనా.. చిత్తూరు ఎమ్మెల్యేపై ఐటీ వేధింపులు?

తెలుగుదేశం పార్టీకి ఫండ్‌ ఇవ్వకపోవడం వల్లనే చిత్తూరు ఎమ్మెల్యేకి వేధింపులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. గత కొన్నిసంవత్సరాలుగా టిడిపికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా చిత్తూరు ఎమ్మెల్యే డబ్బులు ఇస్తేనే ఆ క

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (16:22 IST)
తెలుగుదేశం పార్టీకి ఫండ్‌ ఇవ్వకపోవడం వల్లనే చిత్తూరు ఎమ్మెల్యేకి వేధింపులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. గత కొన్నిసంవత్సరాలుగా టిడిపికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా చిత్తూరు ఎమ్మెల్యే డబ్బులు ఇస్తేనే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాజీ నేత, దివంతగ ఎంపి ఆదికేశవులనాయుడు భార్య. ఆదికేశవుల నాయుడుకు గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. కింగ్‌ఫిషర్‌తో పాటు మరికొన్ని సంస్థలలో వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన వ్యక్తి ఆయన. ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఆయన కూడా ఒకరు.
 
అందుకే అప్పట్లో ఆదికేశవుల నాయుడును తెలుగుదేశంపార్టీ గౌరవించి అనుకున్న సీటును ఇచ్చింది. ఊరికే కాదండోయ్‌.. అంతా పార్టీకి ఇచ్చే ఫండ్‌.. పార్టీ నిర్వహించే కార్యక్రమాలు మొత్తం ఆదికేశవులనాయుడు ఇచ్చే డబ్బుల మీదే నడుస్తుందేదట గతంలో. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అనారోగ్యంతో ఆదికేశవులనాయుడు చనిపోవడంతో ఆయన భార్య ఎమ్మెల్యే అయ్యారు. అయితే భర్త ఇచ్చినట్లుగా పార్టీకి మాత్రం పెద్దగా ఫండ్‌ ఇవ్వలేదామె. డి.కె.కుటుంబానికి సంబంధించిన మొత్తం వ్యవహారాలను కుమారుడు డి.కె.శ్రీనివాసులు చూస్తున్నారు. బెంగుళూరు, పాండిచ్చేరి, ఏపీ ఇలా ఎన్నో ప్రాంతాల్లో పరిశ్రమలు వీరికి ఉన్నాయి. నెలకు కోట్ల రూపాయల్లో టర్నోవర్‌. మొత్తం బాధ్యతలు ఇప్పుడు డి.కె.శ్రీనివాసులది.
 
అయితే గత కొన్నినెలల నుంచి టిడిపి పార్టీ ఫండ్‌ అడిగినా ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇదంతా చూస్తున్న స్థానిక నేతలు ఏకంగా అధినేత దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. దీంతో బాబు సీరియస్‌ అయ్యారని సమాచారం. ఇక అధినేత సీరియస్‌ అయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకదా.. ఏకంగా దాడులే. అది కూడా ఐటీ దాడులు. కోట్ల రూపాయల విలువచేసే ఫైళ్ళను ఐటీ అధికారులు రెండురోజుల పాటు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈనెల 30వ తేదీ వరకు డి.కె. కుటుంబానికి సమయమిచ్చారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. 30 సంవత్సరాల లెక్కను మూడు రోజుల్లో చూపించమంటే ఏ విధంగా చూపిస్తామంటున్నారు డి.కె.కుటుంబం. మొత్తం మీద ఇదంతా పార్టీ అధినేతే చేస్తున్నారని అర్థమైంది డి.కె.కుటుంబానికి మరో రెండురోజుల్లో అధినేతను కలిసి ప్రాధేయపడడానికి సత్యప్రభ, డి.కె. శ్రీనివాసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో ఎదురయ్యే ప్రమాదాలు కథా వస్తువుగా రామ్ గోపాల్ వర్మ చిత్రం శారీ

నా ఎనర్జీకి బన్నీ ఫర్ఫెక్ట్ మ్యాచ్ : రష్మిక మందన్నా

మా ఇల్లు లేడీస్ హాస్టల్‌లా ఉంది.. మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయం..: చిరంజీవి

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments