Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోలోపల బీజేపీ-టీడీపీ ఫైర్: బయటికి మాత్రం భాయిభాయి.. అసలేం జరిగింది?

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2015 (19:03 IST)
బీజేపీ-టీడీపీల మధ్య వార్ జరిగేందుకు అంతా సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వైఖరిపై టీడీపీ లోలోన రగిలిపోతోంది. కానీ బయటకు మాత్రం భాయిభాయి అనుకుంటున్నారు. టీడీపీ-బీజేపీల మధ్య సంబంధాల్ని కటీఫ్ చేసుకోవాలని ఇరు పార్టీలు లోలోపల అనుకుంటున్నప్పటికీ.. ఒకరిపై ఒకరికి అసంతృప్తి ఉన్నా వాటిని కడుపులోనే దాచుకుంటాయి. అయితే స్థానిక క్యాడర్ మాత్రం బయటపడిపోయింది. 
 
ఏపీ దేవాదాయ మంత్రి - బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు సొంత నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం - బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య గొడవ రాజుకుంది. ఇందుకు పశ్చిమ గోదావరి మున్సిపల్ సమావేశం వేదికైంది. టీడీపీ-బీజేపీ కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు. తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన విషయంలో ఇరు పార్టీలకు ఏకాభిప్రాయం కుదరట్లేదని.. ఇక ఉండలేమని బీజేపీతో టీడీపీ తేల్చి చెప్పేసినట్లు సమాచారం.  
 
మున్సిపల్ సమావేశంలో టీడీపీ-బీజేపీకి చెందిన రెండు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. టీడీపీ అన్యాయం చేస్తోందని బీజేపీ, రాష్ట్రాన్ని అనాధ చేస్తున్నది బీజేపీనే అంటూ టీడీపీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు. మరి ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments