పిఠాపురంలో మెగా ఫ్యామిలీ.. పవన్ కోసం చిరంజీవి, బన్నీ, చెర్రీ?

సెల్వి
శనివారం, 27 ఏప్రియల్ 2024 (19:49 IST)
జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వంటి వారు ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన అధ్యక్షుడు పవన్ పోటీ చేస్తున్న నియోజకవర్గమైన పిఠాపురంలో పవర్‌స్టార్ కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు.
 
2019 ఎన్నికల్లో పవన్ ఓడిపోయినందున, ఈసారి, నటుడు-రాజకీయనాయకుడి మద్దతుదారులు ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. శనివారం మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ తన ‘బాబాయ్’ నియోజక వర్గంలో ప్రచారం చేసేందుకు పిఠాపురం వరకు వెళ్లారు.
 
అయితే పవన్ కోసం మెగా ఫ్యామిలీ ప్రచార బరిలోకి దిగనుందని టాక్ వస్తోంది. పవన్ ప్రచారానికి మెగాస్టార్ చిరు రావడం ఖాయం అయితే, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు కూడా రావచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనాని కోసం చెర్రీ, బన్నీ ప్రచారం చేసేందుకు సిద్ధంగా వున్నారని టాక్ వస్తోంది. 
 
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని, దానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉందని, రామ్ చరణ్ నియోజకవర్గంలో ఒకట్రెండు రోజుల పాటు ఇంటింటికీ ప్రచారానికి వెళ్లవచ్చని కొందరు అంటున్నారు. 
Allu arjun-berlin
 
ఇంతకుముందు అల్లు అర్జున్ పవన్ మీటింగ్‌కి వెళ్లడం చూశాం. అయితే చరణ్ తన బాబాయ్ కోసం ఎన్నికలలో వెళ్ళలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా హీరో కోట్లు ఇచ్చినా తప్పు చేయడు... రూ.40 కోట్ల వదులుకున్న పవర్ స్టార్

అనసూయకు గుడికడతాం... అనుమతి ఇవ్వండి... ప్లీజ్

'రణబాలి'గా విజయ్ దేవరకొండ.. ఏఐ వాడలేదంటున్న దర్శకుడు

చిత్రపరిశ్రమలో కమిట్మెంట్ అంటే అర్థం వేరు .. ఓ పెద్దాయన అలా ప్రవర్తించారు : గాయని చిన్మయి

కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్: చిరంజీవి గారు వేరే తరం నుండి వచ్చారు.. ఇప్పుడు పరిస్థితి వేరు.. చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments