Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలువు ఉంటుందో.. ఊడుతుందో.... తీవ్ర ఒత్తిడిలో వేతనజీవులు

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (10:30 IST)
కంటికి కనిపించని కరోనా వైరస్ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాలను తలకిందులు చేసింది. ఈ వైరస్ దెబ్బకు వలస కూలీలు ఉపాధిని కోల్పోయి తిరిగి తమతమ సొంతూళ్ళకు వెళ్లిపోయారు. అలాగే, కరోనా లాక్డౌన్ పుణ్యమాన్ని అనేక కంపెనీలు మూతపడ్డాయి. వీటిలో అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇప్పటికీ తెరుచుకోలేదు. మున్ముందు తెరుచుకుంటాయన్న ఆశా లేదు. దీంతో వేతన జీవుల జీవితాలు దినదినగండంలా మారాయి. ఫలితంగా నెలవారి జీతాలు తీసుకునే ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక మండలి (వరల్డ్ ఎకనామికి ఫోరమ్) తాజాగా వెల్లడించిన ఓ నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది. 
 
ముఖ్యంగా, వచ్చే యేడాది కాలంలో ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా..? అని ప్రపంచవ్యాప్తంగా సగానికిపైగా (54 శాతం) వేతనజీవులు ఆందోళన చెందుతున్నారట. భారత ఉద్యోగుల్లో వీరి వాటా 57 శాతంగా ఉందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌(డబ్ల్యూఈఎఫ్‌) తాజా సర్వే నివేదిక వెల్లడించింది. 
 
అయితే, భవిష్యత్‌ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్య శిక్షణలో తమ యాజమాన్యం సాయపడుతుందని ప్రపంచ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మంది నమ్మకంగా ఉన్నారు. భారత ఉద్యోగుల్లో 80 శాతం తమకు కొత్త నైపుణ్యాలను నేర్చుకోగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments