Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహదారి సమీపంలో నగ్నంగా యువతి-యువకుడి శవాలు: మర్మాంగం ఛిద్రం చేసారు

Webdunia
మంగళవారం, 3 మే 2022 (19:23 IST)
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో జంట హత్యలు కలకలం రేపాయి. ఓ యువకుడు, ఓ యువతి శవాలు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి కొత్తగూడెం బ్రిడ్జికి సమీపంలో నగ్నంగా పడి వున్నాయి. వారి శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... హత్యకు కారణం వివాహేతర సంబంధం అని ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. ఇద్దరి శవాల పక్కనే ఓ బ్యాగు వుండటంతో దాని ఆధారంగా మృతుల వివరాలను కనుగొన్నారు. వీరిద్దరూ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని వారాసిగూడకు చెందిన 22 ఏళ్ల యశ్వంత్, 28 ఏళ్ల జ్యోతిగా గుర్తించారు. యువకుడి మర్మాంగం ఛిద్రం చేసినట్లు గాయాలను బట్టి తెలుస్తుంది. మృతురాలు జ్యోతి తలపై బండరాయితో మోది చంపేసారు.

 
కాగా ఆదివారం సాయంత్రం యశ్వంత్ ఇంటి నుంచి వెళ్లి, ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతడి సోదరుడు తెలిపాడు. ఐతే జ్యోతి ఎవరో తమకు తెలియదన్నారు. మృతురాలు జ్యోతికి భర్త, ఇద్దరు పిల్లలున్నట్లు తేలింది. ఐతే ఈ హత్యలు చేసింది ఎవరన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments