Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహదారి సమీపంలో నగ్నంగా యువతి-యువకుడి శవాలు: మర్మాంగం ఛిద్రం చేసారు

Webdunia
మంగళవారం, 3 మే 2022 (19:23 IST)
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో జంట హత్యలు కలకలం రేపాయి. ఓ యువకుడు, ఓ యువతి శవాలు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి కొత్తగూడెం బ్రిడ్జికి సమీపంలో నగ్నంగా పడి వున్నాయి. వారి శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... హత్యకు కారణం వివాహేతర సంబంధం అని ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. ఇద్దరి శవాల పక్కనే ఓ బ్యాగు వుండటంతో దాని ఆధారంగా మృతుల వివరాలను కనుగొన్నారు. వీరిద్దరూ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని వారాసిగూడకు చెందిన 22 ఏళ్ల యశ్వంత్, 28 ఏళ్ల జ్యోతిగా గుర్తించారు. యువకుడి మర్మాంగం ఛిద్రం చేసినట్లు గాయాలను బట్టి తెలుస్తుంది. మృతురాలు జ్యోతి తలపై బండరాయితో మోది చంపేసారు.

 
కాగా ఆదివారం సాయంత్రం యశ్వంత్ ఇంటి నుంచి వెళ్లి, ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతడి సోదరుడు తెలిపాడు. ఐతే జ్యోతి ఎవరో తమకు తెలియదన్నారు. మృతురాలు జ్యోతికి భర్త, ఇద్దరు పిల్లలున్నట్లు తేలింది. ఐతే ఈ హత్యలు చేసింది ఎవరన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments