Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై అత్యాచారం చేసి... హత్య చేశారు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (14:57 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళను అత్యాచారం చేసిన కొందరు దుండగులు... ఆ తర్వాత హత్య చేశారు. ఈ ఘటన నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో వెలుగు చూసింది. నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలిని గౌలిదొడ్డి ప్రాంతానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.
 
ఈ నెల 25వ తేదీన పాత సామగ్రి సేకరిస్తూ వెళ్లిన మహిళ నిర్మాణంలో ఉన్న ప్రదేశానికి వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమెపై దుండగులు లైంగిక దాడి చేసి అనంతరం బండరాయితో మోది అంతమొందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీమ్‌ సాయంతో ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన అదృశ్యం కేసు ఆధారంగా విచారణ ప్రారంభించారు. తప్పిపోయిన మహిళే హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం