Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై అత్యాచారం చేసి... హత్య చేశారు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (14:57 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళను అత్యాచారం చేసిన కొందరు దుండగులు... ఆ తర్వాత హత్య చేశారు. ఈ ఘటన నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో వెలుగు చూసింది. నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలిని గౌలిదొడ్డి ప్రాంతానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.
 
ఈ నెల 25వ తేదీన పాత సామగ్రి సేకరిస్తూ వెళ్లిన మహిళ నిర్మాణంలో ఉన్న ప్రదేశానికి వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమెపై దుండగులు లైంగిక దాడి చేసి అనంతరం బండరాయితో మోది అంతమొందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీమ్‌ సాయంతో ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన అదృశ్యం కేసు ఆధారంగా విచారణ ప్రారంభించారు. తప్పిపోయిన మహిళే హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం