Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో మోసం.. ప్రియుడిపై కత్తిపీటతో దాడి..

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (13:20 IST)
ప్రియుడు తనను ప్రేమించి, మరో యువతిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువతి.. తన ప్రియుడిపై కత్తిపీటతో దాడిచేసింది. మరొకరి సాయంతో అర్థరాత్రి వేళ మోసం చేసిన ప్రియుడి ఇంటికి వెళ్లిన ప్రియురాలు.. కత్తిపీటతో దాడి చేసి హత్య చేసింది. ఈ దారుణం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, తిరుమలాయ పాలెంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తిరుమలాయపాలేనికి చెందిన ఒమ్మి నాగశేషు అలియాస్ నాగు (25) అనే వ్యక్తి తాపీ పని చేస్తుంటాడు. ఈయనకు రంపచోడవరం మండలం చిలకవీధికి చెందిన కుర్లు డిబేరాతో 2017లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో డిబేరా సుమారు రూ.2 లక్షల నగదు, బంగారపు గొలుసు నాగుకు ఇచ్చినట్టు తెలుస్తోంది.
 
అయితే ఇటీవలే నాగు వేరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్నడి బేరా.. కరణం శివన్నారాయణ అనే వ్యక్తితో కలిసి గురువారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో తిరుమలాయ పాలెంలోని నాగు ఇంటికి వెళ్లి అతడితో ఘర్షణకు దిగింది. 
 
ఆ సమయంలో వారి వెంట తెచుకున్న కత్తిపీట, కర్రతో నాగుపై దాడి చేయడంతోపాటు, అడ్డువచ్చిన నాగు తల్లి గంగను కూడా గాయపర్చి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన నాగును బంధువులు రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కోరుకొండ పోలీసులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments