Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనం కోసం వెళుతూ మహిళను చంపేసిన దొంగలు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 17 జులై 2023 (12:43 IST)
ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. దొంగతనం కోసం బయలుదేరిన ఇద్దరు దొంగలు.. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళను దారుణం హత్య చేశారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ను చితకబాది.. ఆ ఆటోలో పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాకినాడ జిల్లా తుని మండలం, ఎర్రకోనేరు వద్ద జాతీయ రహదారిపై సత్యవతి అనే మహిళ ఒక ఆటోలో ప్రయాణిస్తుంది. అప్పటికే అక్కడకు చేరుకుని మాటు వేసిన ఇద్దరు దొంగలు సడెన్‌గా అడ్డుకుని ఆటోని ఆపారు. ఆపై డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తులైన దొంగలు ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. 
 
ఆ తర్వాత ఆటో డ్రైవర్‌పై దాడి చేసి, ఆ ఆటోలోనే పారిపోయారు. తీవ్రగాయాలైన ఆటో డ్రైవర్‌ను స్థానికులు గుర్తించి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... ఆటో డ్రైవర్‌ నుంచి వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తుంది. ఈ హత్య వెనుక ఏదైనా కుట్ర దాగివుందా? ఆటో డ్రైవర్‌కు సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments