Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనం కోసం వెళుతూ మహిళను చంపేసిన దొంగలు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 17 జులై 2023 (12:43 IST)
ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. దొంగతనం కోసం బయలుదేరిన ఇద్దరు దొంగలు.. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళను దారుణం హత్య చేశారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ను చితకబాది.. ఆ ఆటోలో పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాకినాడ జిల్లా తుని మండలం, ఎర్రకోనేరు వద్ద జాతీయ రహదారిపై సత్యవతి అనే మహిళ ఒక ఆటోలో ప్రయాణిస్తుంది. అప్పటికే అక్కడకు చేరుకుని మాటు వేసిన ఇద్దరు దొంగలు సడెన్‌గా అడ్డుకుని ఆటోని ఆపారు. ఆపై డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తులైన దొంగలు ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. 
 
ఆ తర్వాత ఆటో డ్రైవర్‌పై దాడి చేసి, ఆ ఆటోలోనే పారిపోయారు. తీవ్రగాయాలైన ఆటో డ్రైవర్‌ను స్థానికులు గుర్తించి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... ఆటో డ్రైవర్‌ నుంచి వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తుంది. ఈ హత్య వెనుక ఏదైనా కుట్ర దాగివుందా? ఆటో డ్రైవర్‌కు సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments