Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను చావబాది... భార్యను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (11:56 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న భార్యాభర్తలను అడ్డగించిన కొందరు దుండగులు... భర్తపై దాడి చేసి బంధించారు. అతని భార్యను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఈ నెల 21వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఒరిస్సా రాష్ట్రంలోని జాజిపుర్ జిల్లాకు చెందిన ఓ మహిళ చదువుకునేందుకు బారునా ప్రాంతంలో ఉంటున్నారు. ఆమెను తీసుకెళ్లేందుకు జాజుర నుంచి భర్త వచ్చాడు. ఇద్దరూ కలిసి శనివారం సాయంత్రం ద్విచక్రవాహనంపై వెళుతుండగా, ఓ వాగు సమీపంలో వారిని ఐదుగురు దుండగులు అడ్డగించారు. భర్తపై దాడి చేసి.. మొబైల్, బైక్ తాళాలు లాక్కున్నారు. 
 
అతడిని చావగొట్టి.. భార్యను సమీపంలోని అడవిలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భూబన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బాధితురాలిని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అత్యాచారం రుజువైనట్లు తేలితే.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని మీడియాకు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో అత్యాచారం జరిగినట్లు తేలిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments