Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్లపారాణి ఆరకముందే నవవధువు అనుమానాస్పద మృతి

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (15:12 IST)
కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు అనుమానాస్పదంగా చనిపోయింది. ఆ తర్వాత తన భార్య పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుందని నమ్మించేందుకు కిరాతక భర్త ప్రయత్నించాడు. కర్నాటక రాష్ట్రంలోని ధార్వాడలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ధర్వాడ జిల్లా అనేరికి అనే గ్రామానికి చెందిన షహబాద్ ములగంజ (26)కు గదగ్ జిల్లా గజేంద్రడకు చెందిన షహనాజ్ బేగం (24) అనే యువతిని ఇచ్చి నెలన్నర క్రితం వివాహం చేశారు. వివాహ సమయంలో వధువు తరపు వారు వరుడికి కట్న కానుకలు బాగానే అందజేశారు. ఆ తర్వాత సకల లాంఛనాలతో తమ బిడ్డను అత్తారింటికి పంపించారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత ములగంజ అసలు నిజస్వరూపం తెలియవచ్చింది. అదనపు కట్నం కోసం వేధించసాగాడు. ములగంజ తల్లిదండ్రులు కూడా కొడుకు వత్తాసు పలికి, షహనాజ్‌ను కట్నం కోసం వేధించసాగారు. దీంతో నవ వధువు తాను మోసపోయానని కుమిలిపోసాగింది. 
 
ఈ క్రమంలో రంజాన్ పండుగ రోజున అందరూ పండుగ సంబరాల్లో మునిగివుండగా, షహనాజ్ బేగం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుందని ములగంజ తన అత్తమామలకు సమాచారం చేరవేశాడు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించసాగారు. ఆ తర్వాత అల్లుడిపై అత్తింటివారు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం పేరుతో తమ కుమార్తెను హింసించి హత్య చేశారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments