Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను మంచానికి కట్టేసి.. గొడ్డలితో నరికి.. ఐదు ముక్కలు చేసిన భార్య... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (11:58 IST)
అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్త పట్ల ఆ మహిళ కాళికాదేవిలా ప్రవర్తించింది. నిద్రిస్తున్న భర్తను మంచానికి కట్టేసి.. గొడ్డలితో నరికి చంపేసింది. ఆ తర్వాత శరీరాన్ని ఐదు ముక్కలు చేసింది. ఆ ముక్కలను కాలువలో పడేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిభిత్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఫిలిభిత్‌లోని గుజ్రాలా ప్రాంతంలోని శివనగర్‌కు చెందిన 55 యేళ్ల పాంపాల్ భార్య దులారో దేవీ కొన్ని రోజులుగా తన భర్త స్నేహితుడితో కలిసి ఉంటుంది. నెల రోజుల క్రితం ఆమె తిరిగి గ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ సమీపంలోనే భార్యాపిల్లలతో కలిసి ఉంటున్న కుమారుడికి చెప్పింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దులారో దేవి ప్రవర్తనను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు. 
 
ఈ విచారణలో ఆమె నిజం చెప్పింది. భర్తను తానే చంపేసినట్టు అంగీకరించింది. ఆదివారం రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత మంచానికి కట్టేసి గొడ్డలితో నరికి చంపానని, ఆతర్వాత ఐదు ముక్కలుగా కోసి సమీపంలోని కాలువలో పడేసినట్టు తెలిపింది. దీంతో అతడి శరీర భాగాల కోసం పోలీసులు ఈతగాళ్ల సాయంతో కాలువలో గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments