Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను మంచానికి కట్టేసి.. గొడ్డలితో నరికి.. ఐదు ముక్కలు చేసిన భార్య... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (11:58 IST)
అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్త పట్ల ఆ మహిళ కాళికాదేవిలా ప్రవర్తించింది. నిద్రిస్తున్న భర్తను మంచానికి కట్టేసి.. గొడ్డలితో నరికి చంపేసింది. ఆ తర్వాత శరీరాన్ని ఐదు ముక్కలు చేసింది. ఆ ముక్కలను కాలువలో పడేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిభిత్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఫిలిభిత్‌లోని గుజ్రాలా ప్రాంతంలోని శివనగర్‌కు చెందిన 55 యేళ్ల పాంపాల్ భార్య దులారో దేవీ కొన్ని రోజులుగా తన భర్త స్నేహితుడితో కలిసి ఉంటుంది. నెల రోజుల క్రితం ఆమె తిరిగి గ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ సమీపంలోనే భార్యాపిల్లలతో కలిసి ఉంటున్న కుమారుడికి చెప్పింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దులారో దేవి ప్రవర్తనను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు. 
 
ఈ విచారణలో ఆమె నిజం చెప్పింది. భర్తను తానే చంపేసినట్టు అంగీకరించింది. ఆదివారం రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత మంచానికి కట్టేసి గొడ్డలితో నరికి చంపానని, ఆతర్వాత ఐదు ముక్కలుగా కోసి సమీపంలోని కాలువలో పడేసినట్టు తెలిపింది. దీంతో అతడి శరీర భాగాల కోసం పోలీసులు ఈతగాళ్ల సాయంతో కాలువలో గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments