Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. దళిత నర్సుపై వైద్యుడి అఘాయిత్యం

ఠాగూర్
మంగళవారం, 20 ఆగస్టు 2024 (11:51 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దళిత నర్సుపై వైద్యుడు ఒకడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యూపీలోని మొరాదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. దీనిపై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసుల కథనం మేరకు.. మొరాదాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో దళిత యువతి(20) గత ఏడు నెలలుగా నర్సుగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి 7 గంటలకు విధులకు హాజరైంది. అదే ఆస్పత్రిలో పనిచేసే మరో నర్సు మెహనాజ్.. డాక్టర్ షానవాజ్ గదిలోకి వెళ్లాలని యువతికి సూచించగా ఆమె నిరాకరించారు. దీంతో మెహనాజ్‌‍తో పాటు జునైద్ అనే వార్డుబాయ్ ఆమెను ఆసుపత్రి పై అంతస్తులోని గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి బయటి నుంచి తాళం వేశారు.
 
ఆ తర్వాత గదిలోకి ప్రవేశించిన వైద్యుడు షానవాజ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని గ్రామీణ ఎస్పీ సందీప్ కుమార్ మీనా తెలిపారు. బాధితురాలిని చంపుతానని నిందితుడు బెదిరించాడని, కులం పేరుతో దూషించాడని వివరించారు. షానవాజ్‌తో పాటు నర్సు మెహనాజ్, వార్డుబాయ్ జునైద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆసుపత్రిని తనిఖీ చేసి సీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments