Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన యువతికి జైలుశిక్ష!!

ఠాగూర్
బుధవారం, 8 మే 2024 (11:37 IST)
ఓ యువకుడిపై తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన ఓ యువతిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పుడు పను చేయొద్దని హెచ్చరిస్తూ, నాలుగేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. చట్టాన్ని దుర్వనియోగ పరిచినందుకుగాను ఈ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, బాధితుడికి రూ.5.8 లక్షల పరిఙారం చెల్లించాలని ఆదేశించింది. యువతి ఆరోపణల కారంగా అండర్ ట్రయల్ ఖైదీగా మారిన యువకుడు తన ఆదాయాన్ని కోల్పోయినందుకు ఈ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 2019లో యువతికి 15 యేళ్ళ వయసున్నపుడు ఆమె తల్లి ఈ కేసు దాఖలు చేసింది. యువతి, ఆమె సోదరితో కలిసి ఓ కంపెనీలో పని చేస్తున్న అజయ్ అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేశాడని ఆమె తల్లి ఆరోపించింది. తరచూ తమ ఇంటికొచ్చే అతడికి బాలికతో స్నేహం ఏర్పడిందని, దీన్ని అవకాశంగా తీసుకున్న అతడు ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. 
 
అయితే, విచారణ సందర్భంగా యువతి మాట మార్చింది. అజయ్ తనను కిడ్నాప్ చేయలేదని, అత్యాచారం చేయలేదని పేర్కొంది. దీంతో కోర్టు యువతిపై మండిపడింది. "ఇలాంటి వారి వల్ల అసలైన బాధితులు ఇక్కట్లపాలవుతున్నారు. సమాజంలో ఇదో ఆందోళనకరపరిస్థితి. తమ లక్ష్యం కోసం పోలీసు, న్యాయవ్యవస్థలను దుర్వినియోగపర్చడం, ఆమోదయోగ్యం కాదు. పురుషులు ప్రయోజనాలకు నష్టం కలిగించే అవకాశాన్ని మహిళలకు ఇవ్వరాదని పేర్కొంటూ నాలుగేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments