Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంటీ.. అత్యాచారం అంటే ఏమిటి అని అడిగిన 48 గంటలకే బాలికపై గ్యాంగ్ రేప్

ఐవీఆర్
సోమవారం, 26 ఆగస్టు 2024 (17:21 IST)
అసోంలో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అత్యాచారానికి గురైన బాలికకు సంబంధించి హృదయవిదారక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రెండురోజుల కిందట కోల్ కత హత్యాచారం గురించి పేపర్లో చదివిన బాలిక... ఆంటీ రేప్ అంటే ఏమిటి అని అడిగినట్లు ఆమె బంధువు వెల్లడించారు. ఈ ప్రశ్న అడిగిన 48 గంటలకే ఆమెపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడటంపై బాధితురాలు బంధువు ఆవేదన వ్యక్తం చేసారు. బాలికను రక్షించడంలో తను విఫలమైనట్లు ఆమె చింతిస్తున్నారు.
 
బాలికకు చదువు చెప్పించే స్థోమత లేదని ఆమె తండ్రి సమీప బంధువుల ఇంటికి పంపారు. అక్కడ నుంచి బాలిక ప్రతిరోజూ సైకిల్ పైన వెళ్లి చదువుకుని వస్తోంది. ఈ క్రమంలో రాత్రివేళ ట్యూషన్ ముగియగానే సైకిల్ పైన ఇంటికి వెళ్తున్న బాలికను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా సమీపంలోని చెరువు దగ్గరకు లాక్కెళ్లి అత్యాచారం చేసారు. ఆ తర్వాత బాధితురాలిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు.
 
తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో వున్న బాలికను గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. కాగా దర్యాప్తులో భాగంగా బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని తీసుకుని పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తూ చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం