ఆంటీ.. అత్యాచారం అంటే ఏమిటి అని అడిగిన 48 గంటలకే బాలికపై గ్యాంగ్ రేప్

ఐవీఆర్
సోమవారం, 26 ఆగస్టు 2024 (17:21 IST)
అసోంలో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అత్యాచారానికి గురైన బాలికకు సంబంధించి హృదయవిదారక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రెండురోజుల కిందట కోల్ కత హత్యాచారం గురించి పేపర్లో చదివిన బాలిక... ఆంటీ రేప్ అంటే ఏమిటి అని అడిగినట్లు ఆమె బంధువు వెల్లడించారు. ఈ ప్రశ్న అడిగిన 48 గంటలకే ఆమెపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడటంపై బాధితురాలు బంధువు ఆవేదన వ్యక్తం చేసారు. బాలికను రక్షించడంలో తను విఫలమైనట్లు ఆమె చింతిస్తున్నారు.
 
బాలికకు చదువు చెప్పించే స్థోమత లేదని ఆమె తండ్రి సమీప బంధువుల ఇంటికి పంపారు. అక్కడ నుంచి బాలిక ప్రతిరోజూ సైకిల్ పైన వెళ్లి చదువుకుని వస్తోంది. ఈ క్రమంలో రాత్రివేళ ట్యూషన్ ముగియగానే సైకిల్ పైన ఇంటికి వెళ్తున్న బాలికను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా సమీపంలోని చెరువు దగ్గరకు లాక్కెళ్లి అత్యాచారం చేసారు. ఆ తర్వాత బాధితురాలిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు.
 
తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో వున్న బాలికను గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. కాగా దర్యాప్తులో భాగంగా బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని తీసుకుని పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తూ చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం