రెండో భర్తను చంపిన కేసులో విడుదలైన భార్యను కాల్చి చంపిన మూడో భర్త (video)

ఐవీఆర్
శనివారం, 13 సెప్టెంబరు 2025 (21:36 IST)
ఆమె 3 పెళ్లిళ్లు చేసుకున్నది. తన మాజీ సహచరుడిని హత్య చేసిన కేసులో నాలుగున్నర సంవత్సరాలు జైలులో గడిపి, తరువాత నిర్దోషిగా విడుదలైన 32 ఏళ్ల మహిళను శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆమె ప్రస్తుత సహచరుడు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చి చంపాడు.
 
గ్వాలియర్ నగరంలోని రూప్ సింగ్ స్టేడియం వెలుపల బాధితురాలిని నందిని కేవత్‌గా గుర్తించారు. ఆమె సహచరుడు 33 ఏళ్ల అరవింద్ పరిహార్ ఆమెపై పలుసార్లు కాల్పులు జరిపాడు. దీనితో ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి. ఈ ఘటనను స్థానికులు వీడియోలో బంధించారు. తనతో సహజీవనం చేస్తూ అర్థంతరంగా వదిలేసిన నందిని కోసం నిందితుడు రూప్ సింగ్ రోడ్డు పక్కన కాపు కాసాడు. ఆమె అటుగా రాగానే తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత రోడ్డు పక్కనే కూర్చుని పిస్టల్‌ను చూపిస్తూ, స్థానికులకు గురిపెట్టాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
 
సీఎస్పీ నాగేంద్ర సింగ్ సికార్వర్ నేతృత్వంలోని పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, టియర్ గ్యాస్ షెల్ ప్రయోగించిన తర్వాత, సాయుధ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో పోలీసు బృందం నందినిని ట్రామా సెంటర్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
 
ప్రాథమిక దర్యాప్తులో అరవింద్, నందిని 2022 నుండి సహజీవనంలో ఉన్నారని తేలింది. 2023లో ఒక ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నట్లు అతను పేర్కొన్నాడు, కానీ నందిని అతనిపై అనేక కేసులు నమోదు చేసిన తర్వాత ఆ సంబంధం చెడిపోయింది. 2024లో అలాంటి ఒక కేసులో, ఆమెను కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేసి 3 నెలల పాటు జైలులో వుంచారు. ఈ తర్వాత ఆమె తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంది.
 
ఐతే అరవింద్ తన ఆస్తిలో భాగం ఇస్తానని అంగీకరించిన తర్వాత కేసు ఉపసంహరించుకున్నట్లు చెబుతున్నారు. కానీ జైలు నుంచి విడుదలైన అరవింద్ ఆమెతో విభేదించాడు. ఈ క్రమంలోనే ఆమెను కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
 
అరవింద్‌తో సంబంధానికి ముందు, నందిని ఇతర పురుషులతో కలిసి సహజీవనం చేసింది. వారిలో 2017లో దాటియా జిల్లాలో హత్యకు గురైన నిమ్లేష్ సేన్ కూడా ఉన్నారు. ఈ నేరానికి నందిని మరో భాగస్వామి ఫిరోజ్ ఖాన్‌తో కలిసి జైలు శిక్ష అనుభవించింది. కానీ నాలుగు సంవత్సరాలుగా జైలులో ఉన్న తర్వాత 2022లో కోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. మృతురాలు నందిని 4 పెళ్లిళ్లు చేసుకుంటే నిందితుడు అరవింద్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments