Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు దొంగలు, దుస్తులు విప్పించి కత్తితో బెదిరిస్తూ...

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (17:35 IST)
వారిద్దరు పేరు మోసిన దొంగలు. తాళాలు వేసిన ఇంటికే తాళాలు వేస్తారు. ఇంట్లో ఎవరైనా ఉన్నా సరే చాకచక్యంగా దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఈసారి ఏకంగా తమిళనాడులోని వలసరవాక్కంలోని ఒక సినీనటి ఇంట్లో చొరబడ్డారు. ఆ నటి పలు సీరియళ్ళలో, కొన్ని సినిమాలలో నటించింది. ఆమె భర్తతో గొడవ కారణంగా ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది. విషయం తెలుసుకున్న ఇద్దరు దొంగలు కన్నదాసన్, సెల్వకుమార్‌లు ఇంట్లోకి ప్రవేశించారు.

 
రాత్రి పదిన్నర సమయంలో తలుపు కొట్టారు. ఎవరా అని తలుపు తీయగానే ముసుగు ధరించిన ఇద్దరు దొంగలు లోపలికి ప్రవేశించి కత్తితో బెదిరించారు. ఆ తర్వాత దుస్తులు విప్పేయాలంటూ కత్తితో బెదిరిస్తూ అరిస్తే పొడిచేస్తామన్నారు. దాంతో చేసేది లేక నిస్సాహాయ స్థితిలో దుస్తులు విప్పేసింది. దాంతో తమ వద్ద వున్న సెల్ ఫోన్లో ఆమెను చిత్రీకరించారు. ఆ తర్వాత బీరువా తాళాలు తీసుకుని అందులో వున్న నగదు, నగలు తీసుకుని పారిపోయారు.

 
ఆ నటి పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేసింది. సి.సి. ఫుటేజ్ ద్వారా నిందితులు పాత నేరస్తులుగా గుర్తించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సెల్ ఫోన్ రికవరీ చేసుకునేందుకు అడిగితే పగలగొట్టిన సెల్ ఫోన్ చూపించారు. కాగా దొంగలు అఘాయిత్యం చేసిన నటి ఎవరన్న విషయాన్ని మాత్రం పోలీసులు చెప్పడం లేదు. పేరును గోప్యంగా ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments