Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధుడిని వశం చేసుకున్న పనిమనిషి, రూ. 10 లక్షలతో జంప్

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (14:31 IST)
తండ్రికి వయస్సు అయిపోతోంది. తల్లి మరణించింది. తనకు వివాహం చేసుకోవాలన్న ఆలోచన లేదు. దీంతో పని మనిషిని తీసుకువచ్చి పెట్టాడు. ఆ యువతికి వివాహం జరిగింది కానీ భర్త లేడు. ఇంటి పట్టునే ఉంటూ తండ్రిని చూసుకుంటుందన్న నమ్మకం ఏర్పడింది. ఇంటి దగ్గర పనిమనిషిని వదిలి తన వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళేవాడు కొడుకు. అదే అతను చేసిన తప్పుగా ఆ తరువాత తెలుసుకున్నాడు. 

 
రాజస్థాన్ లోని సోదాల గ్రామంలో నివాసముంటున్నారు కమల్, హుకుమ్ చంద్. హుకుమ్ చంద్ భార్య అనారోగ్యంతో చనిపోయింది. హుకుమ్ చంద్‌కు వయస్సు పైబడింది. ఒక్కగానొక్క కుమారుడు కమల్ పెళ్ళి చేసుకోలేదు.

 
పెళ్ళి చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటే వచ్చిన భార్య తన తండ్రిని ఎలా చూసుకుంటుందోనన్న ఆలోచనతో పెళ్లి ఆలోచన మానేసాడు. దీంతో తండ్రిని చూసుకోవడానికి ఒక పనిమనిషిని మాట్లాడుకున్నాడు. ఆ పనిమనిషి పేరు గాయత్రి. వివాహమైంది కానీ ఆమె భర్తను వదిలేసింది. దీంతో ఇంటి పట్టునే ఉంటూ తండ్రి బాగోగులు దగ్గరగా చూసుకుంటుందని భావించాడు.

 
వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళిపోయేవాడు కమల్. అయితే హుకుమ్ చంద్ దగ్గర డబ్బులతో పాటు ఆస్తులు బాగా ఉన్నాయని గమనించింది గాయత్రి. ఇంకేముంది వృద్ధుడితో బాగా సన్నిహితంగా వుంటూ వచ్చింది. ఈ క్రమంలో అతడిని తనకు వశం చేసుకుని ఆ వృద్ధుడి అకౌంట్ లోని 10 లక్షల డబ్బుతో పాటు అతని పేర మీద ఉన్న 50 లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని సైతం తన పేరుపై రాయించుకుని ఉడాయించింది. ఇది తెలుసుకున్న కమల్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం నిందితురాలు పరారీలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhadrakali review: సమకాలీన రాజకీయచతురతతో విజయ్ ఆంటోని భద్రకాళి చిత్రం రివ్యూ

Kiran Abbavaram: కేరళ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ టీజర్

Rishab Shetty: రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ డేట్ ఫిక్స్

Arjun: యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల మఫ్తీ పోలీస్

Ram Charan : ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్‌ చరణ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

తర్వాతి కథనం
Show comments