ఉద్యోగం ఐటీ ప్రొఫెషన్ - చేసేది గంజాయి వ్యాపారం

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (13:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో ఐటీ ఉద్యోగం చేస్తూ గంజాయిని విక్రయిస్తున్న ఓ మహిళా ఐటీ టెక్కీని పోలీసులు అరెస్టు చేశారు. వారికి సహకరించిన ఇద్దరు యువకుల నుంచి 1.2 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నాచారంలో ఉంటున్న కొండపనేని మాన్సీ అనే ఐటీ ఉద్యోగిని తన భర్త మదన్ మేనేకర్‌తో కలిసి గత రెండేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తుంది. గత నెల 12వ తేదీన ఈ దంపతులు ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా బోయినపల్లి పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. 
 
కానీ, పోలీసుల రాకను గుర్తించిన దంపతులు చాకచక్యంగా తప్పించుకుని పారిపోయారు. కాన, వారితో ఉన్న ఇద్దరు యువకులు మాత్రం 1.2 కేజీల గంజాయితో పట్టుబడ్డారు. భోపాల్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంది. నాచారంలో భర్తతో కలిసి మూడేళ్లుగా నివసిస్తూ గంజాయి వ్యాపారం చేస్తూ వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments