Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 31 మార్చి 2025 (08:08 IST)
దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై కొందరు కామాంధులు సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగింది. ఈ ఆలయానికి అనేక మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తుంటారు. 
 
ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బంధువులతో కలిసి శనివారం సాయంత్రం వచ్చి దైవదర్శనం చేసుకున్నారు. ఆ రాత్రికి అక్కడే నిద్రించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆ యువతి ఒంటరిగా కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతానికి వెళ్లగా అక్కడ మాటువేసివున్న కొందరు యువకులు ఆమెను అటకాయించారు. 
 
ఆ తర్వాత ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడి చేసి చేతులు కట్టేసి, ఆ యువతిని మాత్రం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఊర్కొండపేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులను నిందితులుగా గుర్తించారు. వీరిలో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలినవారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments