Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటి బకెట్లో పడి ప్రాణాలు కోల్పోయిన 11 నెలల బాలుడు

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (15:41 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. 11 నెలల బాలుడు నీటి బకెట్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కథన వివరాలను పరిశీలిస్తే, రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన ఎక్కల దేవీ లక్ష్మణ్, గీత దంపతులు కట్టుపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
సోమవారం సాయంత్రం దంపతులిద్దరు కుట్టుపనిలో నిమగ్నం కాగా, వారి చిన్న కుమారుడు హేమంత్ (11నెలలు) అక్కడే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో హేమంత్ పక్కనే ఉన్న నీటి బకెట్ వద్దకు వెళ్లి ఆడుకుంటూ అందులో పడిపోయాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించలేదు. అప్పటివరకు అక్కడే ఆడుకుంటున్న తమ కుమారుడు కనిపించకపోవడంతో తల్లి కంగారు పడుతూ వెతకడం మొదలు పెట్టింది. 
 
ఈ క్రమంలో నీటి బకెట్లో పడి శ్వాస తీసుకోలేక విలవిలలాడుతుండడాన్ని తల్లి చూసింది. దీంతో వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అప్పటివరకు తల్లిదండ్రుల ముందే సరదాగా ఆడుకుంటూ ఉన్న చిన్నారి ఇక లేడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments